ఫిలిప్పీన్స్ను దిగ్భ్రాంతికి గురిచేసిన కార్మికురాలి హత్య
- January 29, 2023
కువైట్: కువైట్లో ఫిలిప్పీనా కార్మికురాలి హత్య ఫిలిప్పీన్స్ను షాక్ కు గురిచేసింది. మృతురాలు జులేబీ రానారా(35) కువైట్లో నివసిస్తున్న 268,000 మంది విదేశీ ఫిలిపినో కార్మికులలో ఒకరు. వీరిలో ఎక్కువమంది మహిళలు గృహ సహాయకులుగా పనిచేస్తున్నారు. ఆమె కాలిపోయిన అవశేషాలు గత ఆదివారం ఒక ఎడారిలో గుర్తించారు. ఆమె గర్భవతి అని, తీవ్ర గాయాలతో ఆమెను ఎవరో తగులబెట్టారని పోలీసులు వెల్లడించారు. హత్యా నేరం కింద ఆమె యజమాని 17 ఏళ్ల కొడుకును కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ శవపరీక్ష నిర్వహించే వరకు రానారా మరణానికి గల కారణాలపై వ్యాఖ్యానించడానికి వలస కార్మికుల కార్యదర్శి సుసాన్ ఓప్లే నిరాకరించారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఆమె అవశేషాలను స్వదేశానికి తరలించారు. ఈ సందర్భంగా ఫిలిప్పీన్స్లోని కువైట్ రాయబారి ముసేద్ సలేహ్ అల్-త్వైఖ్ మాట్లాడుతూ.. కువైట్ సమాజాన్ని కూడా ఈ సంఘటన దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ఫిలిప్పీన్స్ను కదిలించిన ఈ ఘటన కువైట్లో మొదటి సంఘటన కాదు. 2018 లో ఫిలిపినా గృహ సహాయకురాలు జోవన్నా డానియెలా డెమాఫెలిస్ అనే వ్యక్తి హత్య తర్వాత గల్ఫ్ దేశానికి కార్మికుల ప్రయాణంపై నిషేధం విధించబడింది. అతని మృతదేహాన్ని ఖాళీ అపార్టుమెంటులోని ఫ్రీజర్లో కనుగొనబడింది.
తాజా వార్తలు
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!







