ఫిలిప్పీన్స్ను దిగ్భ్రాంతికి గురిచేసిన కార్మికురాలి హత్య
- January 29, 2023
కువైట్: కువైట్లో ఫిలిప్పీనా కార్మికురాలి హత్య ఫిలిప్పీన్స్ను షాక్ కు గురిచేసింది. మృతురాలు జులేబీ రానారా(35) కువైట్లో నివసిస్తున్న 268,000 మంది విదేశీ ఫిలిపినో కార్మికులలో ఒకరు. వీరిలో ఎక్కువమంది మహిళలు గృహ సహాయకులుగా పనిచేస్తున్నారు. ఆమె కాలిపోయిన అవశేషాలు గత ఆదివారం ఒక ఎడారిలో గుర్తించారు. ఆమె గర్భవతి అని, తీవ్ర గాయాలతో ఆమెను ఎవరో తగులబెట్టారని పోలీసులు వెల్లడించారు. హత్యా నేరం కింద ఆమె యజమాని 17 ఏళ్ల కొడుకును కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ శవపరీక్ష నిర్వహించే వరకు రానారా మరణానికి గల కారణాలపై వ్యాఖ్యానించడానికి వలస కార్మికుల కార్యదర్శి సుసాన్ ఓప్లే నిరాకరించారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఆమె అవశేషాలను స్వదేశానికి తరలించారు. ఈ సందర్భంగా ఫిలిప్పీన్స్లోని కువైట్ రాయబారి ముసేద్ సలేహ్ అల్-త్వైఖ్ మాట్లాడుతూ.. కువైట్ సమాజాన్ని కూడా ఈ సంఘటన దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ఫిలిప్పీన్స్ను కదిలించిన ఈ ఘటన కువైట్లో మొదటి సంఘటన కాదు. 2018 లో ఫిలిపినా గృహ సహాయకురాలు జోవన్నా డానియెలా డెమాఫెలిస్ అనే వ్యక్తి హత్య తర్వాత గల్ఫ్ దేశానికి కార్మికుల ప్రయాణంపై నిషేధం విధించబడింది. అతని మృతదేహాన్ని ఖాళీ అపార్టుమెంటులోని ఫ్రీజర్లో కనుగొనబడింది.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







