ఫిలిప్పీన్స్ను దిగ్భ్రాంతికి గురిచేసిన కార్మికురాలి హత్య
- January 29, 2023
కువైట్: కువైట్లో ఫిలిప్పీనా కార్మికురాలి హత్య ఫిలిప్పీన్స్ను షాక్ కు గురిచేసింది. మృతురాలు జులేబీ రానారా(35) కువైట్లో నివసిస్తున్న 268,000 మంది విదేశీ ఫిలిపినో కార్మికులలో ఒకరు. వీరిలో ఎక్కువమంది మహిళలు గృహ సహాయకులుగా పనిచేస్తున్నారు. ఆమె కాలిపోయిన అవశేషాలు గత ఆదివారం ఒక ఎడారిలో గుర్తించారు. ఆమె గర్భవతి అని, తీవ్ర గాయాలతో ఆమెను ఎవరో తగులబెట్టారని పోలీసులు వెల్లడించారు. హత్యా నేరం కింద ఆమె యజమాని 17 ఏళ్ల కొడుకును కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ శవపరీక్ష నిర్వహించే వరకు రానారా మరణానికి గల కారణాలపై వ్యాఖ్యానించడానికి వలస కార్మికుల కార్యదర్శి సుసాన్ ఓప్లే నిరాకరించారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఆమె అవశేషాలను స్వదేశానికి తరలించారు. ఈ సందర్భంగా ఫిలిప్పీన్స్లోని కువైట్ రాయబారి ముసేద్ సలేహ్ అల్-త్వైఖ్ మాట్లాడుతూ.. కువైట్ సమాజాన్ని కూడా ఈ సంఘటన దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ఫిలిప్పీన్స్ను కదిలించిన ఈ ఘటన కువైట్లో మొదటి సంఘటన కాదు. 2018 లో ఫిలిపినా గృహ సహాయకురాలు జోవన్నా డానియెలా డెమాఫెలిస్ అనే వ్యక్తి హత్య తర్వాత గల్ఫ్ దేశానికి కార్మికుల ప్రయాణంపై నిషేధం విధించబడింది. అతని మృతదేహాన్ని ఖాళీ అపార్టుమెంటులోని ఫ్రీజర్లో కనుగొనబడింది.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







