'సైలెంట్ కిల్లర్' కార్బన్ మోనాక్సైడ్.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- January 29, 2023
దుబాయ్: అనుకోకుండా పీల్చే వ్యక్తులను చంపే కార్బన్ మోనాక్సైడ్ (CO) అనే వాయువు పట్ల అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసులు నివాసితులను హెచ్చరించారు. దీనిని 'నిశ్శబ్ద కిల్లర్'గా పేర్కొంటూ.. దుబాయ్ పోలీసులు CO రంగు, వాసన లేని కారణంగా గుర్తించడం కష్టమని వీడియో ప్రకటన ద్వారా నివాసితులకు జాగ్రత్తలు తెలిపారు. కార్లు లేదా ట్రక్కులు, చిన్న ఇంజన్లు, స్టవ్లు, లాంతర్లు, గ్రిల్స్, నిప్పు గూళ్లు, గ్యాస్ రేంజ్లు లేదా ఫర్నేస్లలో ఇంధనాన్ని కాల్చడం ద్వారా ఉత్పత్తి అయ్యే పొగల్లో కార్బన్ మోనాక్సైడ్ ఉంటుందన్నారు. దీన్ని ఇంటి లోపల పీల్చే వ్యక్తులకు హానీ చేస్తుందని, ముఖ్యంగా ప్రజలు గది లోపల లేదా వాహనాలలో మూసి ఉన్న ప్రదేశాలలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. కార్బన్ మోనాక్సైడ్ శరీరంలో ఎక్కువైతే అత్యంత సాధారణ లక్షణాలు తలనొప్పి, మైకం, బలహీనత, కడుపు నొప్పి, వాంతులు, ఛాతీ నొప్పి లక్షణాలు కనిపిస్తాయని, కొన్ని సందర్భాల్లో అపస్మారక స్థితికి చేరుకుంటారని హెచ్చరించారు. మూసివేయబడిన ప్రదేశాలలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని, స్థానికంగా ధృవీకరించబడిన కూలింగ్/హీటింగ్ ఉపకరణాలను ఉపయోగించాలని దుబాయ్ పోలీసులు నివాసితులను కోరారు. నివాసితుల భద్రత కోసం ఇళ్ల వద్ద CO అలారంను అమర్చాలని నివాసితులకు సూచించారు. మూసి ఉన్న ప్రదేశాల్లో ఎసెన్స్ లేదా కోల్ బర్నర్లను ఎప్పుడూ ఉపయోగించవద్దని పోలీసులు తెలిపారు. గ్యారేజీలో లేదా ఇతర మూసివున్న నిర్మాణంలో పడిఉన్న వాహనంలో ఎక్కువ కాలం ఉండకూడదని వాహనదారులను హెచ్చరించారు. 2020లో ఇద్దరు గృహ కార్మికులు గదిని వేడి చేయడానికి రాత్రిపూట బొగ్గును కాల్చడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ ను అధిక మోతాదులో పీల్చడం వల్ల మరణించారని గుర్తు చేశారు. మరొక సంఘటనలో విల్లాలో ఎలక్ట్రిక్ జనరేటర్ నుండి లీక్ అయిన CO గ్యాస్ను పీల్చడం వల్ల 2022లో ఒక ఆసియా మహిళ, ఆమె కుక్క బర్ దుబాయ్ ప్రాంతంలో మరణించారని తెలిపారు. ఇతర దేశాలలో ప్రజలు వాహనం ఇంజిన్, హీటర్ను ఆన్ చేసి నిద్రపోయే సందర్భాలు ఉన్నాయని, కానీ CO ఉద్గారాలు వాహనంలో ఉన్నవారి మరణానికి దారితీస్తాయని హెచ్చరించారు. అమెరికాలో ప్రతి సంవత్సరం కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం కారణంగా దాదాపు 4,000 మందికి పైగా ఆసుపత్రి పాలవుతున్నారని, అందులో 400 మందికి పైగా మరణిస్తున్నారని దుబాయ్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!







