90కి పెరిగిన మజ్లిస్ అషురా సభ్యుల సంఖ్య
- January 29, 2023
మస్కట్ : మజ్లిస్ అషురాలో ప్రతినిధుల సంఖ్య నాలుగు నుండి 90కి పెరిగింది. పదవ సారి మజ్లిస్ అషురాలోని విలాయత్ల ప్రతినిధుల సంఖ్యను పేర్కొంటూ మంత్రివర్గ నిర్ణయం (నం 19/2023)ను అంతర్గత వ్యవహారాల మంత్రి HE సయ్యద్ హమూద్ బిన్ ఫైసల్ అల్ బుసైదీ జారీ చేశారు. మజ్లిస్లో పదవ టర్మ్లో 90 మంది ప్రతినిధులు ఉంటారని , తొమ్మిదోసారి 86 మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. బిడ్బిడ్, ఇబ్రా విలాయత్లలో ప్రతినిధుల సంఖ్య ఒకటి నుండి ఇద్దరికి పెరిగిందని, జబల్ అఖ్దర్, సినావ్ విలాయత్లకు కొత్త సభ్యులను జోడించినట్లు తెలిపారు. ఇదిలావుండగా మజ్లిస్ అషురా అభ్యర్థిత్వానికి దరఖాస్తుల సమర్పణ గడువు జనవరి 29 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 16వ తేదీతో ముగుస్తుందని హెచ్ఈ సయ్యద్ హమూద్ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు. సభ్యత్వం కోసం పోటీ చేయాలనుకునే పౌరులు తమ దరఖాస్తులను ఎన్నికల వెబ్సైట్ (elections.om) ద్వారా సమర్పించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ







