90కి పెరిగిన మజ్లిస్ అషురా సభ్యుల సంఖ్య
- January 29, 2023
మస్కట్ : మజ్లిస్ అషురాలో ప్రతినిధుల సంఖ్య నాలుగు నుండి 90కి పెరిగింది. పదవ సారి మజ్లిస్ అషురాలోని విలాయత్ల ప్రతినిధుల సంఖ్యను పేర్కొంటూ మంత్రివర్గ నిర్ణయం (నం 19/2023)ను అంతర్గత వ్యవహారాల మంత్రి HE సయ్యద్ హమూద్ బిన్ ఫైసల్ అల్ బుసైదీ జారీ చేశారు. మజ్లిస్లో పదవ టర్మ్లో 90 మంది ప్రతినిధులు ఉంటారని , తొమ్మిదోసారి 86 మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. బిడ్బిడ్, ఇబ్రా విలాయత్లలో ప్రతినిధుల సంఖ్య ఒకటి నుండి ఇద్దరికి పెరిగిందని, జబల్ అఖ్దర్, సినావ్ విలాయత్లకు కొత్త సభ్యులను జోడించినట్లు తెలిపారు. ఇదిలావుండగా మజ్లిస్ అషురా అభ్యర్థిత్వానికి దరఖాస్తుల సమర్పణ గడువు జనవరి 29 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 16వ తేదీతో ముగుస్తుందని హెచ్ఈ సయ్యద్ హమూద్ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు. సభ్యత్వం కోసం పోటీ చేయాలనుకునే పౌరులు తమ దరఖాస్తులను ఎన్నికల వెబ్సైట్ (elections.om) ద్వారా సమర్పించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!







