90కి పెరిగిన మజ్లిస్ అషురా సభ్యుల సంఖ్య
- January 29, 2023
మస్కట్ : మజ్లిస్ అషురాలో ప్రతినిధుల సంఖ్య నాలుగు నుండి 90కి పెరిగింది. పదవ సారి మజ్లిస్ అషురాలోని విలాయత్ల ప్రతినిధుల సంఖ్యను పేర్కొంటూ మంత్రివర్గ నిర్ణయం (నం 19/2023)ను అంతర్గత వ్యవహారాల మంత్రి HE సయ్యద్ హమూద్ బిన్ ఫైసల్ అల్ బుసైదీ జారీ చేశారు. మజ్లిస్లో పదవ టర్మ్లో 90 మంది ప్రతినిధులు ఉంటారని , తొమ్మిదోసారి 86 మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. బిడ్బిడ్, ఇబ్రా విలాయత్లలో ప్రతినిధుల సంఖ్య ఒకటి నుండి ఇద్దరికి పెరిగిందని, జబల్ అఖ్దర్, సినావ్ విలాయత్లకు కొత్త సభ్యులను జోడించినట్లు తెలిపారు. ఇదిలావుండగా మజ్లిస్ అషురా అభ్యర్థిత్వానికి దరఖాస్తుల సమర్పణ గడువు జనవరి 29 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 16వ తేదీతో ముగుస్తుందని హెచ్ఈ సయ్యద్ హమూద్ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు. సభ్యత్వం కోసం పోటీ చేయాలనుకునే పౌరులు తమ దరఖాస్తులను ఎన్నికల వెబ్సైట్ (elections.om) ద్వారా సమర్పించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!







