2023లో మొదటి ఓపెన్ హౌస్ను నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- January 29, 2023
బహ్రెయిన్: భారత రాయబార కార్యాలయం 2023లో మొదటి ఓపెన్ హౌస్ను శుక్రవారం నిర్వహించింది. ఈ సందర్భంగా అంబాసిడర్ పీయూష్ శ్రీవాస్తవ 40 మంది భారతీయ కమ్యూనిటీ సభ్యులను కలుసుకున్నారు.ఈ సందర్భంగా వారి అత్యవసర, సాధారణ కాన్సులర్, ఉద్యోగ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించారు. అలాగే భారత 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఎగురవేత కార్యక్రమం, రిసెప్షన్లో భారతీయ కమ్యూనిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు రాయబారి ధన్యవాదాలు తెలిపారు. ICRF, వరల్డ్ NRI కౌన్సిల్, భారతి అసోసియేషన్, TKS, BKS, ఇండియన్ క్లబ్, బుదయ్య గురుద్వారా, TASCA అందించిన సహకారానికి రాయబారి కృతజ్ఞతలు తెలిపారు. ఎంబసీ, ICRF సంయుక్తంగా జైళ్లు, లేబర్ క్యాంపులలో వైద్య శిబిరాలను నిర్వహించాయని పేర్కొన్నారు. అలాగే తమకు మద్దుతుగా నిలిచిన లోకల్ గవర్నమెంట్ అథారిటీలకు ఈ సందర్భంగా అంబాసిడర్ పీయూష్ శ్రీవాస్తవ ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...







