2023లో మొదటి ఓపెన్ హౌస్ను నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- January 29, 2023
బహ్రెయిన్: భారత రాయబార కార్యాలయం 2023లో మొదటి ఓపెన్ హౌస్ను శుక్రవారం నిర్వహించింది. ఈ సందర్భంగా అంబాసిడర్ పీయూష్ శ్రీవాస్తవ 40 మంది భారతీయ కమ్యూనిటీ సభ్యులను కలుసుకున్నారు.ఈ సందర్భంగా వారి అత్యవసర, సాధారణ కాన్సులర్, ఉద్యోగ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించారు. అలాగే భారత 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఎగురవేత కార్యక్రమం, రిసెప్షన్లో భారతీయ కమ్యూనిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు రాయబారి ధన్యవాదాలు తెలిపారు. ICRF, వరల్డ్ NRI కౌన్సిల్, భారతి అసోసియేషన్, TKS, BKS, ఇండియన్ క్లబ్, బుదయ్య గురుద్వారా, TASCA అందించిన సహకారానికి రాయబారి కృతజ్ఞతలు తెలిపారు. ఎంబసీ, ICRF సంయుక్తంగా జైళ్లు, లేబర్ క్యాంపులలో వైద్య శిబిరాలను నిర్వహించాయని పేర్కొన్నారు. అలాగే తమకు మద్దుతుగా నిలిచిన లోకల్ గవర్నమెంట్ అథారిటీలకు ఈ సందర్భంగా అంబాసిడర్ పీయూష్ శ్రీవాస్తవ ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







