బలూచిస్థాన్ లో ఘోర ప్రమాదం..
- January 29, 2023
పాకిస్థాన్ లోని బలూచిస్థాన్, లాస్బెలాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్యాసింజర్ కోచ్ లోయలో పడి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్యాసింజర్ కోచ్ క్వెట్టా నుంచి కరాచీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు వివరించారు. లాస్బెలాలో ప్యాసింజర్ కోచ్ యూ-టర్న్ తీసుకుంటున్న సమయంలో ఓ బ్రిడ్జి పిల్లర్ ను ఢీ కొట్టిపడిపోయిందని తెలిపారు.
ఆ తర్వాత ప్యాసింజర్ కోచ్ కు మంటలు అంటుకున్నాయని చెప్పారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు, సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారని తెలిపారు. కోచ్ నుంచి ఓ మహిళ, ఓ చిన్నారి సహా ముగ్గురిని ప్రాణాలతో రక్షించారని చెప్పారు. కోచ్ అధిక వేగంతో వెళ్లడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మంటలు అంటుకున్న కోచ్ లో నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నామని, అవి గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయని వివరించారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఇచ్చే వివరాలు తీసుకుని వాటికి డీఎన్ఏ పరీక్షలు చేసి గుర్తిస్తామని చెప్పారు. పాకిస్థాన్ లో పదే పదే ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







