బలూచిస్థాన్ లో ఘోర ప్రమాదం..
- January 29, 2023
పాకిస్థాన్ లోని బలూచిస్థాన్, లాస్బెలాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్యాసింజర్ కోచ్ లోయలో పడి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్యాసింజర్ కోచ్ క్వెట్టా నుంచి కరాచీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు వివరించారు. లాస్బెలాలో ప్యాసింజర్ కోచ్ యూ-టర్న్ తీసుకుంటున్న సమయంలో ఓ బ్రిడ్జి పిల్లర్ ను ఢీ కొట్టిపడిపోయిందని తెలిపారు.
ఆ తర్వాత ప్యాసింజర్ కోచ్ కు మంటలు అంటుకున్నాయని చెప్పారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు, సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారని తెలిపారు. కోచ్ నుంచి ఓ మహిళ, ఓ చిన్నారి సహా ముగ్గురిని ప్రాణాలతో రక్షించారని చెప్పారు. కోచ్ అధిక వేగంతో వెళ్లడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మంటలు అంటుకున్న కోచ్ లో నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నామని, అవి గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయని వివరించారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఇచ్చే వివరాలు తీసుకుని వాటికి డీఎన్ఏ పరీక్షలు చేసి గుర్తిస్తామని చెప్పారు. పాకిస్థాన్ లో పదే పదే ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







