బలూచిస్థాన్ లో ఘోర ప్రమాదం..
- January 29, 2023
పాకిస్థాన్ లోని బలూచిస్థాన్, లాస్బెలాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్యాసింజర్ కోచ్ లోయలో పడి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్యాసింజర్ కోచ్ క్వెట్టా నుంచి కరాచీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు వివరించారు. లాస్బెలాలో ప్యాసింజర్ కోచ్ యూ-టర్న్ తీసుకుంటున్న సమయంలో ఓ బ్రిడ్జి పిల్లర్ ను ఢీ కొట్టిపడిపోయిందని తెలిపారు.
ఆ తర్వాత ప్యాసింజర్ కోచ్ కు మంటలు అంటుకున్నాయని చెప్పారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు, సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారని తెలిపారు. కోచ్ నుంచి ఓ మహిళ, ఓ చిన్నారి సహా ముగ్గురిని ప్రాణాలతో రక్షించారని చెప్పారు. కోచ్ అధిక వేగంతో వెళ్లడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మంటలు అంటుకున్న కోచ్ లో నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నామని, అవి గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయని వివరించారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఇచ్చే వివరాలు తీసుకుని వాటికి డీఎన్ఏ పరీక్షలు చేసి గుర్తిస్తామని చెప్పారు. పాకిస్థాన్ లో పదే పదే ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..







