ఎయిర్ విస్తారా విమానయాన సంస్థకు రూ.70 లక్షల జరిమానా
- February 06, 2023
ముంబై: ఎయిర్ విస్తారా విమానయాన సంస్థకు రూ. 70 లక్షల జరిమానా విధిస్తూ షాక్ ఇచ్చింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA). 2022 ఏప్రిల్ లో దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో కనీస విమాన సర్వీసులను నిర్వహించనందుకు..నిబంధనలను పాటించనందుకు గత అక్టోబర్ లో ఎయిర్ విస్తారాకు జరిమానా విధించింది. దీంతో ఎయిర్ విస్తారా సంస్థ జరిమాని చెల్లించింది అని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు.
విస్తారా ప్రతినిధి స్పందిస్తూ.. విస్తారా గత కొన్నేళ్లుగా RDG (రూట్ డిస్పర్సల్ గైడ్లైన్స్)ని అనుసరిస్తోందని..నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను 2022 అక్టోబర్లో డీజీసీఏ విమానయాన సంస్థపై జరిమానా విధించిందని తెలిపారు. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి సెక్టార్లో కనీస విమానాల సంఖ్య గురించి ఎయిర్లైన్ కంపెనీలకు దిశ నిర్దేశం చేస్తుంది డీజీసీఏ. ఈ నిబంధనలను పాటించి తీరాల్సిందే. ఈ నిబంధనలు పాటించే విధంగా డీజీసీఏ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఈక్రమంలో నిబంధనలను పాటించనందుకు ఎయిర్ విస్తారాకు రూ.70లక్షలు జరిమానా విధించింది డీజీసీఏ.
ఉత్తర పశ్చిమ బెంగాల్ లోని బాగ్ డోగ్రా విమానాశ్రయాన్ని మూసివేయడటం వల్ల కొన్ని విమాన సర్వీసుల్ని రద్దు చేయాల్సి వచ్చిందని ఏప్రిల్ 2022 విమానంలో హైడ్రాలిక్ వైఫల్యం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. సాంకేతిక లోపం కారణంగా విమానం వెనక్కి వెళ్లవలసి వచ్చిందని తెలిపారు. కాగా.. కొన్ని రోజుల క్రితం డిజిసిఎ ఎయిర్ ఇండియాపై కూడా రూ. 30 లక్షల జరిమానా విధించింది. విమానంలో మహిళతో అనుచితంగా ప్రవర్తించినందుకు ఎయిర్ ఇండియాకు ఈ జరిమానా విధించారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!







