ఫ్యాన్స్కి క్లాస్ తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీయార్.!
- February 06, 2023
యంగ్ టైగర్ ఎన్టీయార్ ఫ్యాన్స్కి బాగా గడ్డి పెట్టేశాడు. అప్డేట్స్ .. అప్డేట్స్.. అంటూ ఈ మధ్య ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. డైరెక్టర్లూ, హీరోలూ, మ్యూజిక్ డైరెక్టర్లూ.. ఇలా ఏ ఒక్కర్నీ వదిలేదే.. లే అంటున్నారు ఫ్యాన్స్. దారుణంగా తిట్టి పోస్తున్నారు. ఇక, ఎన్టీయార్ 30 విషయానికి వస్తే, నిర్మాతల్ని ఛండాలంగా తగులుకుంటున్నారు. అలాంటి వారందరి నోళ్లకి తాళం వేసేలా మాట్లాడాడు తాజాగా ఎన్టీయార్.
‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి గెస్ట్గా విచ్చేసిన ఎన్టీయార్.. ఫ్యాన్స్ చేస్తున్న అనవసరమైన హంగామాపై గట్టిగా గడ్డి పెట్టేశాడు. ‘తెలుగు సినిమా స్థాయి గ్లోబల్ రేంజ్ని అందుకుంది. ఈ తరుణంలో తర్వాత రాబోయే ప్రతీ సినిమా విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేయాలి.. ఏమాత్రం తొందరపాటు పనికి రాదు.. ఏదైనా అప్డేట్ వుంటే మా ఇంట్లో మా భార్యల కన్నా ముందు మీకే చెబుతాం.. హడావిడిలో ఏదో ఒక అప్డేట్ ఇచ్చేస్తే..నచ్చలేదని మళ్లీ మీరే తిడతారు. అందుకే, దయచేసి అభిమానులు సంయమనం పాటించాలి.. అని ఎన్టీయార్ వ్యాఖ్యానించారు.
తన కొత్త సినిమా త్వరలో స్టార్ట్ అవుతుందనీ, మార్చి నుంచి రెగ్యలర్ షూట్ ప్రారంభిస్తామనీ, వచ్చే ఏడాదిలో సినిమా రిలీజ్ వుంటుందని కూడా క్లారిటీ ఇచ్చేశారు ఈ సందర్భంగా ఎన్టీయార్.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!