ఫ్యాన్స్కి క్లాస్ తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీయార్.!
- February 06, 2023
యంగ్ టైగర్ ఎన్టీయార్ ఫ్యాన్స్కి బాగా గడ్డి పెట్టేశాడు. అప్డేట్స్ .. అప్డేట్స్.. అంటూ ఈ మధ్య ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. డైరెక్టర్లూ, హీరోలూ, మ్యూజిక్ డైరెక్టర్లూ.. ఇలా ఏ ఒక్కర్నీ వదిలేదే.. లే అంటున్నారు ఫ్యాన్స్. దారుణంగా తిట్టి పోస్తున్నారు. ఇక, ఎన్టీయార్ 30 విషయానికి వస్తే, నిర్మాతల్ని ఛండాలంగా తగులుకుంటున్నారు. అలాంటి వారందరి నోళ్లకి తాళం వేసేలా మాట్లాడాడు తాజాగా ఎన్టీయార్.
‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి గెస్ట్గా విచ్చేసిన ఎన్టీయార్.. ఫ్యాన్స్ చేస్తున్న అనవసరమైన హంగామాపై గట్టిగా గడ్డి పెట్టేశాడు. ‘తెలుగు సినిమా స్థాయి గ్లోబల్ రేంజ్ని అందుకుంది. ఈ తరుణంలో తర్వాత రాబోయే ప్రతీ సినిమా విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేయాలి.. ఏమాత్రం తొందరపాటు పనికి రాదు.. ఏదైనా అప్డేట్ వుంటే మా ఇంట్లో మా భార్యల కన్నా ముందు మీకే చెబుతాం.. హడావిడిలో ఏదో ఒక అప్డేట్ ఇచ్చేస్తే..నచ్చలేదని మళ్లీ మీరే తిడతారు. అందుకే, దయచేసి అభిమానులు సంయమనం పాటించాలి.. అని ఎన్టీయార్ వ్యాఖ్యానించారు.
తన కొత్త సినిమా త్వరలో స్టార్ట్ అవుతుందనీ, మార్చి నుంచి రెగ్యలర్ షూట్ ప్రారంభిస్తామనీ, వచ్చే ఏడాదిలో సినిమా రిలీజ్ వుంటుందని కూడా క్లారిటీ ఇచ్చేశారు ఈ సందర్భంగా ఎన్టీయార్.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







