ముస్లిమేతరుల కోసం మరిన్ని శ్మశానవాటికలు: సౌదీ
- February 06, 2023
సౌదీ:ముస్లిమేతరుల కోసం వారి ప్రాంతాలలో శ్మశానవాటికలను ఏర్పాటు చేయాలని సౌదీ మునిసిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది. ముస్లిమేతరులలో మరణించిన వారి మృతదేహాలను గతంలో మాదిరిగానే జెడ్డా గవర్నరేట్లో ఉన్నటువంటి పరిమిత సంఖ్యలో శ్మశానవాటికలకు తరలించే బదులు వారి అంత్యక్రియల ప్రక్రియను స్థానికంగానే నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు శ్మశానవాటికల అభివృద్ధి చేసే యంత్రాంగానికి సంబంధించిన సమస్యలపై చర్చించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని సీనియర్ నిపుణులతో ఒక సమావేశాన్ని నిర్వహించింది. ముస్లిమేతరులలో మరణించిన వారి కోసం సమాధులను సిద్ధం చేయడానికి, అలాగే మరణించిన వారి బంధువులు ఎలక్ట్రానిక్ సేవల ద్వారా ఖనన ధృవీకరణ పత్రాలను సులభంగా, సరళమైన మార్గంలో పొందేలా చేయడానికి మేయర్లటీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. మరణ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియలను సాధారణంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆసుపత్రులే నిర్వహిస్తాయి.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







