ముస్లిమేతరుల కోసం మరిన్ని శ్మశానవాటికలు: సౌదీ
- February 06, 2023
సౌదీ:ముస్లిమేతరుల కోసం వారి ప్రాంతాలలో శ్మశానవాటికలను ఏర్పాటు చేయాలని సౌదీ మునిసిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది. ముస్లిమేతరులలో మరణించిన వారి మృతదేహాలను గతంలో మాదిరిగానే జెడ్డా గవర్నరేట్లో ఉన్నటువంటి పరిమిత సంఖ్యలో శ్మశానవాటికలకు తరలించే బదులు వారి అంత్యక్రియల ప్రక్రియను స్థానికంగానే నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు శ్మశానవాటికల అభివృద్ధి చేసే యంత్రాంగానికి సంబంధించిన సమస్యలపై చర్చించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని సీనియర్ నిపుణులతో ఒక సమావేశాన్ని నిర్వహించింది. ముస్లిమేతరులలో మరణించిన వారి కోసం సమాధులను సిద్ధం చేయడానికి, అలాగే మరణించిన వారి బంధువులు ఎలక్ట్రానిక్ సేవల ద్వారా ఖనన ధృవీకరణ పత్రాలను సులభంగా, సరళమైన మార్గంలో పొందేలా చేయడానికి మేయర్లటీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. మరణ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియలను సాధారణంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆసుపత్రులే నిర్వహిస్తాయి.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







