ముస్లిమేతరుల కోసం మరిన్ని శ్మశానవాటికలు: సౌదీ
- February 06, 2023
సౌదీ:ముస్లిమేతరుల కోసం వారి ప్రాంతాలలో శ్మశానవాటికలను ఏర్పాటు చేయాలని సౌదీ మునిసిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది. ముస్లిమేతరులలో మరణించిన వారి మృతదేహాలను గతంలో మాదిరిగానే జెడ్డా గవర్నరేట్లో ఉన్నటువంటి పరిమిత సంఖ్యలో శ్మశానవాటికలకు తరలించే బదులు వారి అంత్యక్రియల ప్రక్రియను స్థానికంగానే నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు శ్మశానవాటికల అభివృద్ధి చేసే యంత్రాంగానికి సంబంధించిన సమస్యలపై చర్చించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని సీనియర్ నిపుణులతో ఒక సమావేశాన్ని నిర్వహించింది. ముస్లిమేతరులలో మరణించిన వారి కోసం సమాధులను సిద్ధం చేయడానికి, అలాగే మరణించిన వారి బంధువులు ఎలక్ట్రానిక్ సేవల ద్వారా ఖనన ధృవీకరణ పత్రాలను సులభంగా, సరళమైన మార్గంలో పొందేలా చేయడానికి మేయర్లటీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. మరణ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియలను సాధారణంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆసుపత్రులే నిర్వహిస్తాయి.
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







