ముస్లిమేతరుల కోసం మరిన్ని శ్మశానవాటికలు: సౌదీ
- February 06, 2023
సౌదీ:ముస్లిమేతరుల కోసం వారి ప్రాంతాలలో శ్మశానవాటికలను ఏర్పాటు చేయాలని సౌదీ మునిసిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది. ముస్లిమేతరులలో మరణించిన వారి మృతదేహాలను గతంలో మాదిరిగానే జెడ్డా గవర్నరేట్లో ఉన్నటువంటి పరిమిత సంఖ్యలో శ్మశానవాటికలకు తరలించే బదులు వారి అంత్యక్రియల ప్రక్రియను స్థానికంగానే నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు శ్మశానవాటికల అభివృద్ధి చేసే యంత్రాంగానికి సంబంధించిన సమస్యలపై చర్చించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని సీనియర్ నిపుణులతో ఒక సమావేశాన్ని నిర్వహించింది. ముస్లిమేతరులలో మరణించిన వారి కోసం సమాధులను సిద్ధం చేయడానికి, అలాగే మరణించిన వారి బంధువులు ఎలక్ట్రానిక్ సేవల ద్వారా ఖనన ధృవీకరణ పత్రాలను సులభంగా, సరళమైన మార్గంలో పొందేలా చేయడానికి మేయర్లటీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. మరణ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియలను సాధారణంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆసుపత్రులే నిర్వహిస్తాయి.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









