ఇండోనేషియాలో 22 మంది ఆహుతి

- December 09, 2025 , by Maagulf
ఇండోనేషియాలో  22 మంది ఆహుతి

ఇండోనేషియా రాజధాని జకర్తాలో..అనూహ్య అగ్ని ప్రమాదంలో 22 మంది ప్రాణాలు వదిలారు. మంగళవారం మధ్యాహ్నం  విరామ సమయంలో.. ఓ కంపెనీ ఉద్యోగులు భోజనానికిసిద్ధమవుతున్న క్షణాల్లో..ఓ బ్యాటరీ లింది. అగ్నికీలలు వ్యాపించాయి.

ఏడంతస్థుల భవనంలో జరిగిన ఘోర ప్రమాదంతో.. ఆ భవనంలోని జనం ప్రాణభీతితో అల్లాడి పోయారు. ఈ దుర్ఘటనలో 15 మంది మహిళలు.. 7గురు పురుషులు ఉన్నారు. 19 మంది గాయపడగా ఆసుపత్రికి తరలించారు.

ఈ భవనంలో చిక్కుకున్న జనాన్ని గుర్తించడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.మొదటి అంతస్తులో మధ్యాహ్నం సమయంలో చెలరేగిన మంటలు త్వరగా భవనం అంతటా వ్యాపించాయని సెంట్రల్ జకార్తా పోలీసు చీఫ్ సుసాత్యో పూర్నోమో కాండ్రో తెలిపారు. భవనంలో నివసించే  టెర్రా డ్రోన్ ఇండోనేషియా కంపెనీలో  ఉద్యోగులు భోజన విరామంలో ఉన్నప్పుడు మంటలు చెలరేగాయి,

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com