ఒమన్ కు భారీగా పర్యాటకులు.. ఈ సీజన్ లో 200 క్రూయిజ్ షిప్ల రాక!
- February 06, 2023
మస్కట్: 2022-2023 సీజన్లో ఒమన్ను సందర్శించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని, దాదాపు 200 వరకు క్రూయిజ్ షిప్ లు వచ్చే అవకాశం ఉందని హెరిటేజ్ మంత్రిత్వ శాఖలోని పర్యాటక నమూనాల విభాగం డైరెక్టర్ ఖలీద్ మహ్మద్ అల్ అజ్రీ అన్నారు. COVID-19 మహమ్మారి కంటే ముందు పర్యాటక సీజన్లలో ఒమన్ను సందర్శించే పర్యాటకుల సంఖ్య 280,000కి దాటిందని ఖలీద్ మొహమ్మద్ అల్ అజ్రీ చెప్పారు. హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖలో టూరిజం ప్రమోషన్ డైరెక్టర్ జనరల్ హైతం మొహమ్మద్ అల్ ఘస్సానీ మాట్లాడుతూ.. ఒమన్లో శీతాకాలం అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు ఉంటుందని, ఆ సమయంలో అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తారన్నారు. ఇప్పటికే శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు, ఈవెంట్లు, ఫెస్టివల్స్ ప్రకటించిందన్నారు. వాటిలో కొన్ని ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలిపారు. నార్త్ అల్ షర్కియాలోని ఎడారి అడ్వెంచర్స్ ఫెస్టివల్, ఐరన్మ్యాన్ ఈవెంట్ లు పర్యాటకులను అలరిస్తున్నాయని చెప్పారు. ప్రపంచంలోని అన్ని దేశాల నుండి పర్యాటకులను ఆకర్షించడంలో క్రూయిజ్ లైనర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నందున, ఒమన్లో క్రూయిజ్ షిప్ల రద్దీని పెంచడానికి హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!
- విద్యుత్ ఛార్జీలు పెంచనున్నాం: సీఎం చంద్రబాబు
- ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమలు…
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు







