ప్రైవేట్ కంపెనీలలో ఎమిరటైజేషన్: నిబంధనలను సవరించిన యూఏఈ
- February 07, 2023
యూఏఈ: దేశంలోని ప్రైవేట్ రంగంలో ఎమిరేటైజేషన్ పథకంలోని కొన్ని నిబంధనలను సవరిస్తూ యూఏఈ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. వార్షిక లక్ష్యాన్ని రెండు విభాగాలుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి ఆరు నెలల్లో 1 శాతం, రెండవ ఆరు నెలల్లో మిగిలిన 1 శాతాన్ని పూర్తి చేయాలి. ఫెడరల్ చట్టం 2026 చివరి నాటికి 10 శాతానికి చేరుకోవడానికి ఏటా 2 శాతం ఎమిరేటైజేషన్ రేట్లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2022 చివరి నాటికి కంపెనీలు 2 శాతం ఎమిరాటీలను నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో నియమించాలి. UAE మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) 2022లో ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైన ప్రైవేట్ కంపెనీలకు 400 మిలియన్ దిర్హామ్ల జరిమానాను విధించింది. 2022 సంవత్సరంలో దాదాపు 9,293 కంపెనీలు ఎమిరటైజేషన్ లక్ష్యాలను సాధించాయి. 50,000 కంటే ఎక్కువ మంది ఎమిరాటీలు ఇప్పుడు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు, 'నఫీస్' కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి 28,700 మంది ఎమిరాటీలు కొత్తగా ఉద్యోగాల్లో చేరారు. ప్రస్తుతం ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఎమిరాటీల సంఖ్య 70 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..
- అవార్డులు గెలుచుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!