తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
- February 11, 2023
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి భారీగా విద్యుత్ డిమాండ్ పెరిగింది.గత ఏడాదితో పోల్చితే విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరిగింది. రాష్ట్రంలో శుక్రవారం (ఫిబ్రవరి 10,2023) కంటే శనివారం (ఫిబ్రవరి 11,2023) అత్యధిక విద్యుత్ ను వినియోగించారు. శనివారం ఉదయం 10 గంటల వరకు 14 వేల 350 మెగావాట్ల విద్యుత్ ను వినియోగించారు.శుక్రవారం (ఫిబ్రవరి10,2023) సాయంత్రం 4 గంటలకు వరకు 14 వేల 169 యూనిట్లుగా నమోదు అయింది.
గత ఏడాది ఇదే రోజున 11 వేల 420 మెగావాట్ల విద్యుత్ ను వినియోగించారు.ఈ ఏడాది మే నెల వరకు రోజువారి విద్యుత్ వినియోగం 15 వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.రాష్ట్రంలో రోజు రోజుకు విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. సాగు విస్తీర్ణ పెరుగడంతోపాటు పారిశ్రామిక అసవరాలు పెరిగిన నేపత్యంలో శుక్రవారం (ఫిబ్రవరి10,2023)తో పోల్చితే శనివారం ( ఫిబ్రవరి 11,2023) 14 వేల 500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది.
శుక్రవారం (ఫిభ్రవరి 10,2023) ఇదే సమయానికి 14 వేల 169 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడగా శనివారం (ఫిబ్రవరి11,2023) తాజాగా ఆ రికార్డ్ బ్రేక్ చేస్తూ రికార్డు స్థాయిలో 14 వేల 500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అయింది.ఈ డిమాండ్ కూడా మధ్యాహ్నం తర్వాత మరింత పెరిగే అవకాశమున్నట్లు విద్యుత్ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది మార్చి నెలలో 14 వేల 160 మెగావాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే గతేడాది రికార్డును అధిగమించినట్లుగా చెప్పవచ్చు.
ఈ సారి వేసవిలో కూడా 15 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అవసరముందని విద్యుత్ అధికారులు అంచనా వేస్తున్నారు.రానున్నది వేసవి కాలంగా కాబట్టి సాగు విస్తీర్ణంతోపాటు గృహ అవసరాలకు సంబంధించి విద్యుత్ వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు ఇటు తెలంగాణ డిస్కంలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









