ఎయిర్ ఏషియాకు 20 లక్షల జరిమానా: DGCA
- February 11, 2023
న్యూఢిల్లీ: ఎయిర్ ఏషియా విమానయాన సంస్థకు 20 లక్షల జరిమానా విధించారు. పైలట్ శిక్షణలో లోపం ఉన్నట్లు ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ సంస్థ పేర్కొన్నది. పైలట్ నైపుణ్యం చెకింగ్ సమయంలో ఎయిర్ ఏషియా పైలట్ తన స్కిల్స్ను ప్రదర్శించలేకపోయినట్లు డీజీసీఏ తెలిపింది. అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ సంస్థ రూల్స్ ప్రకారం ఆ పైలట్ పర్ఫార్మ్ చేయలేకపోయాడు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఎయిర్ ఏషియాపై డీజీసీఏ జరిమానా వేసింది.
ఎయిర్ ఏషియాకు చెందిన ట్రైనింగ్ హెడ్ను కూడా మూడు నెలల పాటు ఆ పొజిషన్ నుంచి తొలగించారు. డీజీసీఏ ఏవియేషన్ రూల్స్ ఉల్లంఘించిన కేసులో అతనిపై కూడా వేటు వేశారు. ఈ ఘటనలో మొత్తం 8 మందిపై మూడు లక్షల చొప్పున ఫైన్ వేశారు. రెగ్యులేటరీ నిబంధనలను విస్మరించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదు అని డీజీసీఏ విమాన సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లిఖితపూర్వక సమాధాన్ని పరిశీలించిన తర్వాత జరిమానా వేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







