ఎయిర్ ఏషియాకు 20 లక్షల జరిమానా: DGCA
- February 11, 2023
న్యూఢిల్లీ: ఎయిర్ ఏషియా విమానయాన సంస్థకు 20 లక్షల జరిమానా విధించారు. పైలట్ శిక్షణలో లోపం ఉన్నట్లు ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ సంస్థ పేర్కొన్నది. పైలట్ నైపుణ్యం చెకింగ్ సమయంలో ఎయిర్ ఏషియా పైలట్ తన స్కిల్స్ను ప్రదర్శించలేకపోయినట్లు డీజీసీఏ తెలిపింది. అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ సంస్థ రూల్స్ ప్రకారం ఆ పైలట్ పర్ఫార్మ్ చేయలేకపోయాడు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఎయిర్ ఏషియాపై డీజీసీఏ జరిమానా వేసింది.
ఎయిర్ ఏషియాకు చెందిన ట్రైనింగ్ హెడ్ను కూడా మూడు నెలల పాటు ఆ పొజిషన్ నుంచి తొలగించారు. డీజీసీఏ ఏవియేషన్ రూల్స్ ఉల్లంఘించిన కేసులో అతనిపై కూడా వేటు వేశారు. ఈ ఘటనలో మొత్తం 8 మందిపై మూడు లక్షల చొప్పున ఫైన్ వేశారు. రెగ్యులేటరీ నిబంధనలను విస్మరించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదు అని డీజీసీఏ విమాన సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లిఖితపూర్వక సమాధాన్ని పరిశీలించిన తర్వాత జరిమానా వేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









