విమానం గాలిలో ఉండగానే గుండెపోటుతో ప్రయాణికుడు మృతి
- February 19, 2023
దుబాయ్: దుబాయ్ నుంచి ఢాకా వెళ్లాల్సిన ఫ్లైదుబాయ్ విమానంలో ఓ ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందారు. దీంతో విమానాన్ని శనివారం కరాచీకి మళ్లించారు. ఫిబ్రవరి 18న దుబాయ్ నుండి ఢాకాకు వెళ్లే FZ 523 విమానంలో మరణించిన ప్రయాణికుడి కుటుంబానికి ఫ్లైదుబాయ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోందని ఎయిర్లైన్ ప్రతినిధి ప్రకటించారు. ఫ్లైదుబాయ్ ఫ్లైట్ ఎఫ్జెడ్ 523ని స్మార్ట్వింగ్స్ దుబాయ్ ఇంటర్నేషనల్ (డిఎక్స్బి) విమానాశ్రయం నుండి ఢాకా ఎయిర్పోర్ట్కు బయలుదేరింది. విమానం గాలిలో ఉండగానే బంగ్లాదేశ్ ప్రయాణీకుడు( 59) గుండెపోటు కారణంగా మరణించాడు. కరాచీలో ల్యాండింగ్ తర్వాత వైద్య బృందాలు పరీక్షించాయని..అంతకుముందే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని తెలపింది. ఈ నెల ప్రారంభంలో సిడ్నీ నుండి దుబాయ్ వెళ్లే ఎమిరేట్స్ విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా పెర్త్కు మళ్లించిన ఘటన జరిగింది. మరొక సంఘటనలో,ఎయిర్లైన్ బ్రస్సెల్-బౌండ్ ఫ్లైట్ మిడ్-ఎయిర్ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇరాక్ నగరమైన ఎర్బిల్కి మళ్లించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







