విమానం గాలిలో ఉండగానే గుండెపోటుతో ప్రయాణికుడు మృతి
- February 19, 2023
దుబాయ్: దుబాయ్ నుంచి ఢాకా వెళ్లాల్సిన ఫ్లైదుబాయ్ విమానంలో ఓ ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందారు. దీంతో విమానాన్ని శనివారం కరాచీకి మళ్లించారు. ఫిబ్రవరి 18న దుబాయ్ నుండి ఢాకాకు వెళ్లే FZ 523 విమానంలో మరణించిన ప్రయాణికుడి కుటుంబానికి ఫ్లైదుబాయ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోందని ఎయిర్లైన్ ప్రతినిధి ప్రకటించారు. ఫ్లైదుబాయ్ ఫ్లైట్ ఎఫ్జెడ్ 523ని స్మార్ట్వింగ్స్ దుబాయ్ ఇంటర్నేషనల్ (డిఎక్స్బి) విమానాశ్రయం నుండి ఢాకా ఎయిర్పోర్ట్కు బయలుదేరింది. విమానం గాలిలో ఉండగానే బంగ్లాదేశ్ ప్రయాణీకుడు( 59) గుండెపోటు కారణంగా మరణించాడు. కరాచీలో ల్యాండింగ్ తర్వాత వైద్య బృందాలు పరీక్షించాయని..అంతకుముందే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని తెలపింది. ఈ నెల ప్రారంభంలో సిడ్నీ నుండి దుబాయ్ వెళ్లే ఎమిరేట్స్ విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా పెర్త్కు మళ్లించిన ఘటన జరిగింది. మరొక సంఘటనలో,ఎయిర్లైన్ బ్రస్సెల్-బౌండ్ ఫ్లైట్ మిడ్-ఎయిర్ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇరాక్ నగరమైన ఎర్బిల్కి మళ్లించారు.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









