ఆంధ్ర కళా వేదిక ఆధ్వర్యంలో కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరం
- February 19, 2023
దోహా: ఖతార్ లో చాలా మంది తెలుగు సోదరులు పని లేకుండా ఇబ్బందులు పడుతున్న తరుణంలో దానికి తొడుగా వారిలో అనారోగ్యం కూడా చాల మందిని భాదిస్తూ ఉండటం, అక్కడున్న పరిస్థితుల్లో హెల్త్ కార్డ్ లేక చాల మంది హాస్పిటల్ కి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో వున్నారని తెలుసుకొని ఆంధ్ర కళా వేదిక-ఖతార్ కార్యనిర్వాహక బృందం వారు వెల్లకిన్స్ మెడికల్ సెంటర్ వారితో కలిసి సంయుక్తంగా ఉచిత వైద్య శిబిర సదుపాయం వర్కర్స్ కోసం ఏర్పాటు చేసారు.శుక్రవారం రోజున ఉదయం 7 గం నుండి 12 గం వరకు ప్రత్యేకించి మన తెలుగు వర్కర్స్ కోసం ఈ ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించటం జరిగింది.పెద్ద సంఖ్యలో 200 మందికి పైగా తెలుగు కార్మికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు.ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ఆంధ్ర కళా వేదికకు తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం నుండి భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్ హాజరై కార్మికుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రత్యేకించి ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని, వెల్కిన్స్ మెడికల్ సెంటర్ యాజమాన్యాన్ని, ఇండియన్ మెడికల్ క్లబ్(IDC) డాక్టర్స్ ని, యునైటెడ్ నర్సస్ అఫ్ ఇండియా-ఖతార్ (UNIQ) నర్సస్ ని, వెయిల్కార్నెల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ని అభినందించారు.
ఈ వైద్య శిబిరానికి ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) జనరల్ సెక్రటరీ- కృష్ణ కుమార్, అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్-కె.ఎస్. ప్రసాద్, ఆంధ్ర కళా వేదిక అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ సత్యనారాయణ మలిరెడ్డి, ప్రముఖ తెలుగు నాయకులు నందిని అబ్బగొని, శ్రీధర్, హరీష్ రెడ్డి, Ch.రవి కిషోర్, సయెద్ రఫీ, చూడామణి కూడా హాజరయ్యి ఇటువంటి ఉదాత్తమైన సామాజిక సహాయ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆంధ్ర కళా వేదిక కార్యవర్గాన్ని అభినందించారు.
ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించుకోవటానికి ముఖ్య కారకులైన టువంటి, AKV ఉపాధ్యక్షులు గొట్టిపాటి రమణ కృషిని ఎంతగానో అభినందించారు. ఈ కార్యక్రమ భారీ విజయంలో భాగమైనందుకు వెల్కిన్స్ మెడికల్ సెంటర్ యాజమాన్యానికి, ఇండియన్ మెడికల్ క్లబ్(IDC) డాక్టర్స్ కి, యునైటెడ్ నర్సస్ అఫ్ ఇండియా-ఖతార్ (UNIQ) నర్సస్ కి, వెయిల్కార్నెల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి మరియు మద్దతుదారులందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు, ముఖ్యంగా నవయుగ రెసిడెంట్ డైరెక్టర్-సిహెచ్. రవికిషోర్ కి ఈ కార్యక్రమాన్ని సుసాధ్యం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాక ఈ కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు అందజేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అందరికీ అల్పాహారాలు ఏర్పాటుచేశారు.ఈ కార్యక్రమాన్ని కార్యవర్గ సభ్యులు గొట్టిపాటి రమణ, విక్రమ్ సుఖవాసి, కేటి రావు, విబికె మూర్తి, శ్రీసుధ, సాయి రమేష్, SS రావు మరియు సోమరాజు కలిసి చాలా చక్కగా నిర్వహించినందుకు అభినందనలు తెలియజేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







