ఇరాన్ భూకంపంతో ఖతార్కు ముప్పు లేదు: అథారిటీ
- February 21, 2023
దోహా: నైరుతి ఇరాన్లో మంగళవారం సంభవించిన భూకంపం కారణంగా ఖతార్ రాష్ట్రానికి ఎలాంటి ప్రమాదం లేదని ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (QCAA) ప్రకటించింది. సివిల్ ఏవియేషన్ అథారిటీకి అనుబంధంగా ఉన్న ఖతార్ సీస్మిక్ నెట్వర్క్లోని అధికారి ఇబ్రహీం ఖలీల్ అల్ యూసఫ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ఉన్న అరేబియన్ ప్లేట్, ఇరానీయన్ ప్లేట్ కారణంగా జాగ్రోస్ పర్వతాల వెంబడి భూకంపాలు సంభవిస్తాయని వివరించారు. నైరుతి ఇరాన్లో 5.3-తీవ్రతతో సంభవించిన భూకంపం తరువాత ఖతార్ రాష్ట్రం లోపల సంభవించిన ప్రకంపనలు స్పల్పంగా ఉన్నాయని, వాటితో ప్రమాదం లేదని అల్ యూసఫ్ తెలిపారు. ఉదయం 9:05 గంటలకు (దోహా సమయం) ఇరాన్కు నైరుతి దిశలో రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఖతార్ సీస్మిక్ నెట్వర్క్ నమోదు చేసింది.
తాజా వార్తలు
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు, బలమైన గాలులు..అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు..నివాసితులకు అలెర్ట్ జారీ..!!









