200 శాతం పెరిగిన విమాన టికెట్ల ధరలు..
- February 23, 2023
కువైట్ సిటీ: ఈ నెల 25 కువైట్ జాతీయ దినోత్సవం సందర్భంగా వరుసగా సెలవులు రావడంతో నివాసితులు, ప్రవాసులు విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రధానంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలు, టర్కీ, లండన్, కైరో, బీరూట్ తదితర గమ్యస్థానాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో విమాన టికెట్ల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చేశాయి. ఏకంగా 200 శాతం మేర విమాన టికెట్ల ధరలు పెరిగినట్లు కువైట్ ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు దేశీయ విమానాలకు కూడా అదే స్థాయిలో డిమాండ్ ఉందని కువైత్ ఎయిర్వేస్ అధికారి షోరఖ్ అల్-అవధి వెల్లడించారు. ప్రయాణీకుల డిమాండ్ మేరకు కొత్త గమ్యస్థానాలకు కొత్త సర్వీసులు సైతం ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







