ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- September 23, 2025
యూఏఈ: దుబాయ్లో బంగారం ధరలు దాదాపు ప్రతిరోజూ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. తాజాగా గ్రాముకు Dh450 దాటింది. దుబాయ్ జ్యువెలరీ గ్రూప్ డేటా ప్రకారం.. గ్రాముకు 24 కెరట్ గోల్డ్ Dh451.75 కు చేరుకుంది. దుబాయ్లో తొలిసారిగా 21కెరట్ గోల్డ్ ధర గ్రాముకు Dh400 కు చేరుకుంది.
స్పాట్ గోల్డ్ ఔన్స్ 0.24 శాతం పెరిగి $3,749.32 వద్ద ట్రేడవుతోంది. పెప్పర్స్టోన్లో మార్కెట్ నిపుణులు అహ్మద్ అస్సిరి మాట్లాడుతూ.. బంగారం ఇప్పటికీ అత్యుత్తమ పెట్టుబడి మార్గంగా కొనసాగుతోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న తాజా ఘటనల కారణంగా బంగారానికి డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు. గోల్డ్ లో పెట్టుబడులను ఇన్వెస్టర్లు సురక్షితమైనవిగా భావిస్తున్నారని తెలిపారు. డారల్ పై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ ను అధిక మొత్తంలో కొనుగోలు చేయడం కూడా బంగారం ధరల పెరుగుదలకు మరో కారణం అని వివరించారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







