ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- September 23, 2025
యూఏఈ: దుబాయ్లో బంగారం ధరలు దాదాపు ప్రతిరోజూ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. తాజాగా గ్రాముకు Dh450 దాటింది. దుబాయ్ జ్యువెలరీ గ్రూప్ డేటా ప్రకారం.. గ్రాముకు 24 కెరట్ గోల్డ్ Dh451.75 కు చేరుకుంది. దుబాయ్లో తొలిసారిగా 21కెరట్ గోల్డ్ ధర గ్రాముకు Dh400 కు చేరుకుంది.
స్పాట్ గోల్డ్ ఔన్స్ 0.24 శాతం పెరిగి $3,749.32 వద్ద ట్రేడవుతోంది. పెప్పర్స్టోన్లో మార్కెట్ నిపుణులు అహ్మద్ అస్సిరి మాట్లాడుతూ.. బంగారం ఇప్పటికీ అత్యుత్తమ పెట్టుబడి మార్గంగా కొనసాగుతోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న తాజా ఘటనల కారణంగా బంగారానికి డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు. గోల్డ్ లో పెట్టుబడులను ఇన్వెస్టర్లు సురక్షితమైనవిగా భావిస్తున్నారని తెలిపారు. డారల్ పై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ ను అధిక మొత్తంలో కొనుగోలు చేయడం కూడా బంగారం ధరల పెరుగుదలకు మరో కారణం అని వివరించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









