ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- September 23, 2025
యూఏఈ: దుబాయ్లో బంగారం ధరలు దాదాపు ప్రతిరోజూ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. తాజాగా గ్రాముకు Dh450 దాటింది. దుబాయ్ జ్యువెలరీ గ్రూప్ డేటా ప్రకారం.. గ్రాముకు 24 కెరట్ గోల్డ్ Dh451.75 కు చేరుకుంది. దుబాయ్లో తొలిసారిగా 21కెరట్ గోల్డ్ ధర గ్రాముకు Dh400 కు చేరుకుంది.
స్పాట్ గోల్డ్ ఔన్స్ 0.24 శాతం పెరిగి $3,749.32 వద్ద ట్రేడవుతోంది. పెప్పర్స్టోన్లో మార్కెట్ నిపుణులు అహ్మద్ అస్సిరి మాట్లాడుతూ.. బంగారం ఇప్పటికీ అత్యుత్తమ పెట్టుబడి మార్గంగా కొనసాగుతోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న తాజా ఘటనల కారణంగా బంగారానికి డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు. గోల్డ్ లో పెట్టుబడులను ఇన్వెస్టర్లు సురక్షితమైనవిగా భావిస్తున్నారని తెలిపారు. డారల్ పై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ ను అధిక మొత్తంలో కొనుగోలు చేయడం కూడా బంగారం ధరల పెరుగుదలకు మరో కారణం అని వివరించారు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









