ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- September 23, 2025
యూఏఈ: దుబాయ్లో బంగారం ధరలు దాదాపు ప్రతిరోజూ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. తాజాగా గ్రాముకు Dh450 దాటింది. దుబాయ్ జ్యువెలరీ గ్రూప్ డేటా ప్రకారం.. గ్రాముకు 24 కెరట్ గోల్డ్ Dh451.75 కు చేరుకుంది. దుబాయ్లో తొలిసారిగా 21కెరట్ గోల్డ్ ధర గ్రాముకు Dh400 కు చేరుకుంది.
స్పాట్ గోల్డ్ ఔన్స్ 0.24 శాతం పెరిగి $3,749.32 వద్ద ట్రేడవుతోంది. పెప్పర్స్టోన్లో మార్కెట్ నిపుణులు అహ్మద్ అస్సిరి మాట్లాడుతూ.. బంగారం ఇప్పటికీ అత్యుత్తమ పెట్టుబడి మార్గంగా కొనసాగుతోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న తాజా ఘటనల కారణంగా బంగారానికి డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు. గోల్డ్ లో పెట్టుబడులను ఇన్వెస్టర్లు సురక్షితమైనవిగా భావిస్తున్నారని తెలిపారు. డారల్ పై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ ను అధిక మొత్తంలో కొనుగోలు చేయడం కూడా బంగారం ధరల పెరుగుదలకు మరో కారణం అని వివరించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







