శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- September 23, 2025
న్యూయార్క్: శాంతియుత పాలస్తీనా కోసం సౌదీ అరేబియా, ఫ్రాన్స్ చేతులు కలిపాయి. గాజా మరియు వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనా అధికారానికి మద్దతు ఇవ్వడానికి తమ మద్దతు కొనసాగుతుందని న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమావేశంలో మరోసారి స్పష్టం చేశాయి.
ఈ సందర్భంగా పాలస్తీనా అథారిటీ "ఒక రాష్ట్రం, ఒక ప్రభుత్వం, ఒక చట్టం మరియు ఒక ఆయుధం" విధానాన్ని రియాద్ , పారిస్ స్వాగతించాయి. గాజాలో హమాస్ నియంత్రణను ముగించడానికి తమ మద్దతు ఉంటుందన్నారు. అంతర్జాతీయ పర్యవేక్షణలో పాలస్తీనా అథారిటీకి ఆయుధాలను అందజేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా రూపొందించిన "న్యూయార్క్ డిక్లరేషన్"కు UN జనరల్ అసెంబ్లీలో 142 సభ్య దేశాలలో అత్యధిక మెజారిటీతో ఆమోదించారు. మధ్యప్రాచ్యంలో శాంతి, స్థిరత్వానికి టూ స్టేట్స్ పరిష్కారం ఒక్కటే ఆమోదయోగ్యమైన మార్గమని సౌదీ, ఫ్రాన్స్ తేల్చిచెప్పాయి.
అదే సమయంలో గాజా నగరంపై ఇజ్రాయెల్ భూ దాడి తీవ్రతరం చేయడంతో గాజాలో పెరుగుతున్న మానవతా విషాదం పట్ల ఆందోలన వ్యక్తం చేశారు. స్వతంత్ర, ప్రజాస్వామ్య దేశంగా పాలస్తీనా కోసం ఇజ్రాయెల్ సాయపడాలని కోరారు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









