శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- September 23, 2025
న్యూయార్క్: శాంతియుత పాలస్తీనా కోసం సౌదీ అరేబియా, ఫ్రాన్స్ చేతులు కలిపాయి. గాజా మరియు వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనా అధికారానికి మద్దతు ఇవ్వడానికి తమ మద్దతు కొనసాగుతుందని న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమావేశంలో మరోసారి స్పష్టం చేశాయి.
ఈ సందర్భంగా పాలస్తీనా అథారిటీ "ఒక రాష్ట్రం, ఒక ప్రభుత్వం, ఒక చట్టం మరియు ఒక ఆయుధం" విధానాన్ని రియాద్ , పారిస్ స్వాగతించాయి. గాజాలో హమాస్ నియంత్రణను ముగించడానికి తమ మద్దతు ఉంటుందన్నారు. అంతర్జాతీయ పర్యవేక్షణలో పాలస్తీనా అథారిటీకి ఆయుధాలను అందజేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా రూపొందించిన "న్యూయార్క్ డిక్లరేషన్"కు UN జనరల్ అసెంబ్లీలో 142 సభ్య దేశాలలో అత్యధిక మెజారిటీతో ఆమోదించారు. మధ్యప్రాచ్యంలో శాంతి, స్థిరత్వానికి టూ స్టేట్స్ పరిష్కారం ఒక్కటే ఆమోదయోగ్యమైన మార్గమని సౌదీ, ఫ్రాన్స్ తేల్చిచెప్పాయి.
అదే సమయంలో గాజా నగరంపై ఇజ్రాయెల్ భూ దాడి తీవ్రతరం చేయడంతో గాజాలో పెరుగుతున్న మానవతా విషాదం పట్ల ఆందోలన వ్యక్తం చేశారు. స్వతంత్ర, ప్రజాస్వామ్య దేశంగా పాలస్తీనా కోసం ఇజ్రాయెల్ సాయపడాలని కోరారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









