చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- September 23, 2025
మస్కట్: చరిత్రలో తొలిసారిగా ఒమానీ రియాల్తో పోలిస్తే భారత రూపాయి రూ.230 దాటింది. US డాలర్తో పోలిస్తే ఇంట్రాడేలో భారత రూపాయి 31 పైసల తగ్గడం ఈ పతనానికి కారణమైంని నిపుణులు తెలిపారు. US డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ 88.72 కు చేరి ఆల్-టైమ్ కనిష్ట స్థాయిని తాకిందని మస్కట్లో నివసిస్తున్న ఆర్థిక నిపుణుడు ఆర్. మధుసూదనన్ పేర్కొన్నారు. అమెరికా H-1B వీసా రుసుము పెంపు ప్రకటనే కారణమని అన్నారు.
ఇండియాకు ఇన్వర్డ్ రెమిటెన్స్కు ప్రధాన వాటిలో ఒకటైన ఐటీ పరిశ్రమ అమెరికా ప్రకటనతో భయాందోళనలకు గురైందని అన్నారు. దాంతో ఐటీ ఇండెక్స్ 1% కంటే ఎక్కువ తగ్గుదల నమోదైందని, భారత స్టాక్ ఎక్స్ఛేంజ్లోని పదహారు ప్రధాన రంగాలలో పదమూడు నష్టాల్లో కొనసాగుతున్నట్లు తెలిపారు.
రష్యన్ ముడి చమురు కొనుగోలు కారణంగా భారతీయ వస్తువులపై ఇప్పటికే ప్రకటించిన అధిక టారిఫ్ సుంకాల కారణంగా భారత రూపాయి బలహీన పడింది. ఇప్పుడు వీసా రుసుములపై తాజా ప్రకటన మార్కెట్ను మరింత దెబ్బతీసిందని అని మధుసూదనన్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









