ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్: భారత్ పై విజయం సాధించిన ఆస్ట్రేలియా
- February 23, 2023
ఆస్ట్రేలియా: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భారత్ పోరాటం ముగిసింది.సెమీఫైనల్లో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడింది.భారత్ పై విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ఫైనల్ కు చేరుకుంది. 173 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులే చేసింది. దీంతో 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఓపెనర్లు షఫాలీ శర్మ(9), స్మృతీ మందాన(2), యస్తికా భాటియా(4) విఫలమైనా జెమీమా రోడ్రిగ్స్ 43(24 బంతుల్లో), హర్మన్ ప్రీత్ 52(34 బంతుల్లో) ఆదుకున్నారు. అయితే చివరలో హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఓ దశలో గెలుస్తుందనుకున్న భారత్ ఓటమి పాలైంది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసింది.
కాగా ఈ మ్యాచ్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ అద్భుతంగా ఆడింది. హాఫ్ సెంచరీతో చెలరేగింది. 34 బంతుల్లోనే 52 పరుగులు చేసింది. 6 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టింది. హర్మన్ ప్రీత్ కౌర్ దూకుడుగా ఆడి భారత్ ను విజయానికి చేరువ చేసింది. మరికాసేపు ఆమె క్రీజులో ఉండి ఉంటే గెలుపు మనదే అని అంతా అనుకున్నారు. భారత్ విజయానికి 32 బంతుల్లో 39 రన్స్ కావాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆమె రనౌట్ అయ్యింది. అంతే, మ్యాచ్ ములుపు తిరిగింది. భారత్ ఓటమి పాలైంది.
కేప్ టౌన్ జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ బెత్ మూనీ 54, కెప్టెన్ మెగ్ లానింగ్ 49 (నాటౌట్), ఆష్లే గార్డనర్ 31, అలీసా హీలా 25 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో శిఖా పాండే 2 వికెట్లు తీసింది. దీప్తి శర్మ, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు.
173 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కు ఆరంభంలోనే కష్టాలు ఎదురయ్యాయి. 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. స్టార్ ఓపెనర్ స్మృతి మందాన 2, యువ బ్యాటర్ షెఫాలీ వర్మ 9 పరుగులకే వెనుదిరిగారు. వన్ డౌన్ లో వచ్చిన యస్తికా భాటియా 4 పరుగులు చేసి రనౌట్ అయింది. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ జట్టును ఆదుకున్నారు. కానీ, జట్టుని గెలిపించలేకపోయారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







