చరణ్ ఖాతాలో మరో అరుదైన గౌరవం.!
- February 24, 2023అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోగా పాపులర్ అయిన ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వెళ్లారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ షోకి అతిధిగా వెళ్లిన తొలి తెలుగు నటుడు చరణ్ కావడం విశేషం.
అలాగే, తొలి ఇండియన్ నటుడు కూడా రామ్ చరణే కావడం మరో విశేషం. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ పురస్కారాల ప్రధానోత్సవంలో పాల్గొనేందుకు రామ్ చరణ్ న్యూయార్క్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే ఈ టాక్ షోకి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ఈ సందర్భంగా ఆయన ముచ్చటించారు.
అలాగే, హాలీవుడ్ సినిమాలో నటించాలని వుందన్న తన మనసులోని కోరికను సైతం బయటపెట్టారు. హాలీవుడ్ డైరెక్టర్లు ఇండియన్ నటుల పైనా, తెలుగు సినీ నటులపైనా, కూడా ఫోకస్ పెట్టాలని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు