చరణ్ ఖాతాలో మరో అరుదైన గౌరవం.!
- February 24, 2023
అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోగా పాపులర్ అయిన ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వెళ్లారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ షోకి అతిధిగా వెళ్లిన తొలి తెలుగు నటుడు చరణ్ కావడం విశేషం.
అలాగే, తొలి ఇండియన్ నటుడు కూడా రామ్ చరణే కావడం మరో విశేషం. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ పురస్కారాల ప్రధానోత్సవంలో పాల్గొనేందుకు రామ్ చరణ్ న్యూయార్క్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే ఈ టాక్ షోకి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ఈ సందర్భంగా ఆయన ముచ్చటించారు.
అలాగే, హాలీవుడ్ సినిమాలో నటించాలని వుందన్న తన మనసులోని కోరికను సైతం బయటపెట్టారు. హాలీవుడ్ డైరెక్టర్లు ఇండియన్ నటుల పైనా, తెలుగు సినీ నటులపైనా, కూడా ఫోకస్ పెట్టాలని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







