అనేక విమానాలను రద్దు చేసిన ఎమిరేట్స్
- February 27, 2023
యూఏఈ: కార్మికులు వేతనాల కోసం చేపట్టిన సమ్మె కారణంగా దుబాయ్కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఫిబ్రవరి 27న అనేక విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. డ్యూసెల్డార్ఫ్ విమానాశ్రయంలో ప్రకటించిన సార్వత్రిక సమ్మె కారణంగా ఫిబ్రవరి 27న దుబాయ్ -డ్యూసెల్డార్ఫ్ మధ్య పలు విమానాలు రద్దు చేసినట్లు ఎమిరేట్స్ తెలిపింది. రద్దయిన విమానాల్లో EK055: దుబాయ్ నుండి డ్యూసెల్డార్ఫ్, EK056: డ్యూసెల్డార్ఫ్ నుండి దుబాయ్, EK057 : దుబాయ్ నుండి డ్యూసెల్డార్ఫ్, EK058 : డ్యూసెల్డార్ఫ్ నుండి దుబాయ్ ఉన్నాయి.
జర్మనీలోని వెర్డి లేబర్ యూనియన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 27న కొలోన్ బాన్ (CGN), డ్యూసెల్డార్ఫ్ (DUS) విమానాశ్రయాల వద్ద సమ్మె చేయాలని యోచిస్తున్నారు. సమ్మె ఫిబ్రవరి 26-27 రాత్రిపూట ప్రారంభమై.. ఫిబ్రవరి 27-28 రాత్రిపూట ముగియనుంది. సమ్మె కారణంగా ప్రభావిత విమానాశ్రయాలలో ప్రాసెసింగ్ ఆలస్యం, రద్దుతో సహా విమాన అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసిన ఎమిరేట్స్.. బాధిత ప్రయాణికులు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారం కోసం ట్రావెల్ ఏజెంట్లు, ఎమిరేట్స్ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









