సౌదీలో 2035 నాటికి 82% వేస్ట్ డంప్స్ తొలగింపు
- February 28, 2023
రియాద్: 2035 నాటికి సౌదీ అరేబియాలో అన్ని రకాల వేస్ట్ డంప్లలో 82% తోలగించనున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ వేస్ట్ మేనేజ్మెంట్ (MWAN) సెక్టార్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ మెషరీ అల్-క్వీజానీ తెలిపారు. రియాద్లో వేస్ట్ మేనేజ్మెంట్ సెక్టార్లో జరిగిన ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్లో అల్-క్వీజానీ పాల్గొని ప్రసంగించారు. వేస్ట్ మేనేజ్మెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టామని, త్వరలోనే సౌదీ అరేబియా సానుకూల పర్యావరణ, ఆర్థిక- సామాజిక ప్రభావాలను చూస్తుందని అల్-క్వీజానీ పేర్కొన్నారు. 73 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ సమానమైన వాటిని తగ్గించి పర్యావరణ హితానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఇంధన వినియోగంలో 60 మిలియన్ బ్యారెళ్ల చమురును ఆదా చేస్తామని పేర్కొన్నారు. ఆర్థికంగా ఇది 1,200 వ్యర్థ పదార్థాల నిర్వహణ సౌకర్యాలను ఏర్పాటు చేయడంతోపాటు 77,000 ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు. దాంతో పాటు 120 బిలియన్ల స్థూల దేశీయోత్పత్తికి (GDP) దోహదపడుతుందని అల్-క్వీజానీ వెల్లడించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









