సౌదీలో 2035 నాటికి 82% వేస్ట్ డంప్స్ తొలగింపు
- February 28, 2023
రియాద్: 2035 నాటికి సౌదీ అరేబియాలో అన్ని రకాల వేస్ట్ డంప్లలో 82% తోలగించనున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ వేస్ట్ మేనేజ్మెంట్ (MWAN) సెక్టార్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ మెషరీ అల్-క్వీజానీ తెలిపారు. రియాద్లో వేస్ట్ మేనేజ్మెంట్ సెక్టార్లో జరిగిన ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్లో అల్-క్వీజానీ పాల్గొని ప్రసంగించారు. వేస్ట్ మేనేజ్మెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టామని, త్వరలోనే సౌదీ అరేబియా సానుకూల పర్యావరణ, ఆర్థిక- సామాజిక ప్రభావాలను చూస్తుందని అల్-క్వీజానీ పేర్కొన్నారు. 73 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ సమానమైన వాటిని తగ్గించి పర్యావరణ హితానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఇంధన వినియోగంలో 60 మిలియన్ బ్యారెళ్ల చమురును ఆదా చేస్తామని పేర్కొన్నారు. ఆర్థికంగా ఇది 1,200 వ్యర్థ పదార్థాల నిర్వహణ సౌకర్యాలను ఏర్పాటు చేయడంతోపాటు 77,000 ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు. దాంతో పాటు 120 బిలియన్ల స్థూల దేశీయోత్పత్తికి (GDP) దోహదపడుతుందని అల్-క్వీజానీ వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







