సౌదీలో 2035 నాటికి 82% వేస్ట్ డంప్స్ తొలగింపు
- February 28, 2023
రియాద్: 2035 నాటికి సౌదీ అరేబియాలో అన్ని రకాల వేస్ట్ డంప్లలో 82% తోలగించనున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ వేస్ట్ మేనేజ్మెంట్ (MWAN) సెక్టార్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ మెషరీ అల్-క్వీజానీ తెలిపారు. రియాద్లో వేస్ట్ మేనేజ్మెంట్ సెక్టార్లో జరిగిన ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్లో అల్-క్వీజానీ పాల్గొని ప్రసంగించారు. వేస్ట్ మేనేజ్మెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టామని, త్వరలోనే సౌదీ అరేబియా సానుకూల పర్యావరణ, ఆర్థిక- సామాజిక ప్రభావాలను చూస్తుందని అల్-క్వీజానీ పేర్కొన్నారు. 73 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ సమానమైన వాటిని తగ్గించి పర్యావరణ హితానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఇంధన వినియోగంలో 60 మిలియన్ బ్యారెళ్ల చమురును ఆదా చేస్తామని పేర్కొన్నారు. ఆర్థికంగా ఇది 1,200 వ్యర్థ పదార్థాల నిర్వహణ సౌకర్యాలను ఏర్పాటు చేయడంతోపాటు 77,000 ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు. దాంతో పాటు 120 బిలియన్ల స్థూల దేశీయోత్పత్తికి (GDP) దోహదపడుతుందని అల్-క్వీజానీ వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







