ఇద్దరు సౌదీ మాజీ దౌత్యవేత్తలతో పాటు 13 మంది అరెస్ట్
- March 06, 2023
రియాద్ : బంగ్లాదేశ్లోని సౌదీ రాయబార కార్యాలయంలో గతంలో దౌత్యవేత్తలుగా పనిచేసిన ఇద్దరు మాజీ దౌత్యవేత్తలతో పాటు 13 మందిని అవినీతి ఆరోపణలతో అరెస్టు అయ్యారు. అరెస్టయిన వారిలో ఇద్దరు భద్రతా సిబ్బంది, ఎనిమిది మంది ప్రవాసులు, ఒక విదేశీ పెట్టుబడిదారు కూడా ఉన్నారు. పర్యవేక్షణ, అవినీతి నిరోధక అథారిటీ (నజాహా), అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన భద్రతా కార్యకలాపాలలో భాగంగా ఈ అరెస్టులు జరిగాయి. అరెస్టయిన మాజీ దౌత్యవేత్తలలో ఢాకాలోని సౌదీ రాయబార కార్యాలయంలో మాజీ డిప్యూటీ అంబాసిడర్, కాన్సులర్ విభాగం అధిపతి అబ్దుల్లా ఫలాహ్ అల్-షమ్మరీ, ఎంబసీలోని కాన్సులర్ విభాగం డిప్యూటీ హెడ్ ఖలీద్ నాసర్ అల్-ఖహ్తానీ ఉన్నారని నజాహా వెల్లడించింది. వీరు వీసా వ్యాపారంలో నిమగ్నమై ఉన్నకొందరు విదేశీయులతో ఉద్దేశపూర్వకంగా కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మాజీ దౌత్యవేత్తలు రాయబార కార్యాలయంలో పని చేస్తున్న సమయంలో రాజ్యంలో వర్క్ వీసాల జారీని పూర్తి చేయడానికి వాయిదాల పద్ధతిలో SR45 మిలియన్లను లంచంగా పొందినట్లు రుజువైందని నజాహా తెలిపింది.
తాజా వార్తలు
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము







