ఏప్రిల్‌ 30న నూతన సచివాలయం ప్రారంభం

- March 10, 2023 , by Maagulf
ఏప్రిల్‌ 30న నూతన సచివాలయం ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. ఏప్రిల్‌ 30న కొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. నూతనంగా నిర్మించిన సచివాలయానికి డా.బీఆర్‌ అంబేడ్కర్‌ రాష్ట్ర సచివాలయంగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. జూన్‌ 2న తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కాగా, అంతకుముందు కొత్త సచివాలయాన్ని సందర్శించిన సిఎం కెసిఆర్‌ అక్కడ జరుగుతున్న భవణ నిర్మాణ పనులను పరిశీలించడంతో పాటు సెక్రటెరీయట్ ప్రారంభతేదీపై అధికారులతో చర్చించారు. మరోవైపు సచివాలయం పక్కనే నిర్మిస్తున్న డా. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత సచివాలయమంతా పరిశీలించిన సిఎం కెసిఆర్… త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్‌ 2 లోపు సెక్రటేరియట్‌, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్థూపం ప్రారంభించాలని ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com