విశాఖలో 19న ఇండియా-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్..
- March 10, 2023
విశాఖపట్నం: ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 19న విశాఖపట్నంలో వన్డే మ్యాచ్ జరగబోతుంది. ఇది డే అండ్ నైట్ మ్యాచ్. ఈ మ్యాచ్కు సంబంధించిన టిక్కెట్ల విక్రయం నేటి నుంచి ప్రారంభం కానుంది. మార్చి 10, శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి టిక్కెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి.
మార్చి 14 నుంచి ఆఫ్లైన్ టిక్కెట్ల విక్రయం ప్రారంభమవుతుంది. ఆన్లైన్లో టిక్కెట్లు కావాలనుకునే వాళ్లు పేటీఎం యాప్, పేటీఎం ఇన్సైడర్ యాప్, ఇన్సైడర్.ఇన్ వెబ్సైట్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఆఫ్లైన్లో టిక్కెట్లు కావాలనుకునే వాళ్లు ఈ నెల 14 నుంచి పీఎం పాలెం క్రికెట్ స్టేడియం-బి, జీవీఎంసీ మున్సిపల్ స్టేడియం, రాజీవ్ గాంధీ క్రీడా ప్రాంగణాల్లో కొనుగోలు చేయవచ్చు. టికెట్ల ధరలు రూ.600, రూ.1,500, రూ.2000, రూ.3000, రూ.3,500, రూ.6000గా ఉండే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ టోర్నీ ముగిసిన తర్వాత ఇరు జట్ల మధ్య వన్డే టోర్నీ ఆరంభమవుతుంది. ఇది మూడు వన్డేల సిరీస్. ఇందులో తొలి వన్డే ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ నెల 17న జరుగుతుంది. తర్వాత రెండో వన్డే 19న విశాఖపట్నంలో జరుగుతుంది. మూడో వన్డే చెపాక్ స్టేడియంలో జరుగుతుది. విశాఖపట్నంలో చివరిసారిగా వన్డే మ్యాచ్ 2019లో జరిగింది. గత ఏడాది మాత్రం ఇక్కడ ఒక టీ20 మ్యాచ్ జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...







