ధర స్థిరంగా...
- May 05, 2016
కొనుగోళ్లు మందకొడిగా సాగడంతో బంగారం ధర గురువారం స్థిరంగా ఉంది. బుధవారం నాటి ధర రూ.30,100 వద్దే కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగినప్పటికీ దేశీయంగా కీలక సమయాల్లో కొనుగోళ్లు జరగకపోవడంతో దీని ధర స్థిరంగా ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.3 శాతం పెరిగి 1,283.44 అమెరికన్ డాలర్లకు చేరింది.గురువారం వెండి ధర పెరిగింది. రూ.50 పెరగడంతో కేజీ వెండి ధర రూ.41,100కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడం తదితర కారణాల వల్ల దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 0.4శాతం పెరిగి 17.41 యూఎస్ డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









