కువైట్‌లో మార్చి 17న 'ఫెస్టివల్ ఆఫ్ ఇండియా'

- March 15, 2023 , by Maagulf
కువైట్‌లో మార్చి 17న \'ఫెస్టివల్ ఆఫ్ ఇండియా\'

కువైట్: భారత రాయబార కార్యాలయం మార్చి 17వ తేదీ( శుక్రవారం) సాయంత్రం 5:30 నుండి 7:30 గంటల వరకు సాల్మియాలోని అబ్దుల్‌హుస్సేన్ అబ్దుల్రిదా థియేటర్‌లో 'ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇన్ కువైట్'ని నిర్వహిస్తోంది. అనిరుధ్ వర్మ కలెక్టివ్ ద్వారా బాలీవుడ్ ఫ్యూజన్, కుత్బీ బ్రదర్స్ ద్వారా ఖవ్వాలి, హసన్ ఖాన్ బృందంచే రాజస్థానీ ఫోక్ వంటి వివిధ భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహించనున్నారు. వీరితోపాటు భారతదేశంలోని ప్రసిద్ధ సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు ఉంటాయి. రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే ఈవెంట్‌కు ప్రవేశం కల్పిస్తారు. ఆసక్తి గల వారు https://t.co/CWY9EqZ0x6 లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కువైట్లోని ఇండియన్ ఎంబసీ సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com