కువైట్లో మార్చి 17న 'ఫెస్టివల్ ఆఫ్ ఇండియా'
- March 15, 2023
కువైట్: భారత రాయబార కార్యాలయం మార్చి 17వ తేదీ( శుక్రవారం) సాయంత్రం 5:30 నుండి 7:30 గంటల వరకు సాల్మియాలోని అబ్దుల్హుస్సేన్ అబ్దుల్రిదా థియేటర్లో 'ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇన్ కువైట్'ని నిర్వహిస్తోంది. అనిరుధ్ వర్మ కలెక్టివ్ ద్వారా బాలీవుడ్ ఫ్యూజన్, కుత్బీ బ్రదర్స్ ద్వారా ఖవ్వాలి, హసన్ ఖాన్ బృందంచే రాజస్థానీ ఫోక్ వంటి వివిధ భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహించనున్నారు. వీరితోపాటు భారతదేశంలోని ప్రసిద్ధ సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు ఉంటాయి. రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే ఈవెంట్కు ప్రవేశం కల్పిస్తారు. ఆసక్తి గల వారు https://t.co/CWY9EqZ0x6 లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కువైట్లోని ఇండియన్ ఎంబసీ సూచించింది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









