1 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- March 15, 2023
యూఏఈ: అబుధాబిలో నివసిస్తున్న దిపిష్ అనే భారతీయ జాతీయుడు.. మార్చి 11న జరిగిన మహ్జూజ్ డ్రా 119వ వారపు డ్రాలో 1,000,000 దిర్హామ్ల రాఫిల్ బహుమతిని గెలుచుకున్నాడు. పెద్ద సూపర్ మార్కెట్ చైన్లో పనిచేస్తున్న ఈ 38 ఏళ్ల గ్రాఫిక్ డిజైనర్.. 14 సంవత్సరాల క్రితం యూఏఈ వచ్చాడు. ఇంతకుముందు మహ్జూజ్లో చిన్న బహుమతులను గెలుచుకున్నానని, కానీ ఇంత పెద్ద మొత్తంలో బహుమతి గెలుచుకోవడం నమ్మశక్యం కావడం లేదన్నారు. వచ్చిన బహుమతి మనీనుంచి కొంత భాగాన్ని తన ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకుంటానని తెలిపారు. అదే డ్రాలో 25 మంది ఇతర పార్టిసిపెంట్లు ఐదు నంబర్లలో నాలుగింటిని సరిపోల్చారు. రెండవ బహుమతి కింద Dh200,000 పంచుకున్నారు. ఒక్కొక్కరు Dh8,000 సంపాదించారు. 1,030 మంది ఇతర విజేతలు ఐదు సంఖ్యలలో మూడింటితో సరిపోల్చడంతో.. ఒక్కొక్కరు Dh250 అందుకున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







