1 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- March 15, 2023
యూఏఈ: అబుధాబిలో నివసిస్తున్న దిపిష్ అనే భారతీయ జాతీయుడు.. మార్చి 11న జరిగిన మహ్జూజ్ డ్రా 119వ వారపు డ్రాలో 1,000,000 దిర్హామ్ల రాఫిల్ బహుమతిని గెలుచుకున్నాడు. పెద్ద సూపర్ మార్కెట్ చైన్లో పనిచేస్తున్న ఈ 38 ఏళ్ల గ్రాఫిక్ డిజైనర్.. 14 సంవత్సరాల క్రితం యూఏఈ వచ్చాడు. ఇంతకుముందు మహ్జూజ్లో చిన్న బహుమతులను గెలుచుకున్నానని, కానీ ఇంత పెద్ద మొత్తంలో బహుమతి గెలుచుకోవడం నమ్మశక్యం కావడం లేదన్నారు. వచ్చిన బహుమతి మనీనుంచి కొంత భాగాన్ని తన ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకుంటానని తెలిపారు. అదే డ్రాలో 25 మంది ఇతర పార్టిసిపెంట్లు ఐదు నంబర్లలో నాలుగింటిని సరిపోల్చారు. రెండవ బహుమతి కింద Dh200,000 పంచుకున్నారు. ఒక్కొక్కరు Dh8,000 సంపాదించారు. 1,030 మంది ఇతర విజేతలు ఐదు సంఖ్యలలో మూడింటితో సరిపోల్చడంతో.. ఒక్కొక్కరు Dh250 అందుకున్నారు.
తాజా వార్తలు
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ
- SBI ఇన్సూరెన్స్ స్కీం: ₹3,000 ప్రీమియంతో ₹60 లక్షల ప్రమాద బీమా
- JEE మెయిన్ 2026 ఫైనల్ కీ విడుదల









