1 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- March 15, 2023
యూఏఈ: అబుధాబిలో నివసిస్తున్న దిపిష్ అనే భారతీయ జాతీయుడు.. మార్చి 11న జరిగిన మహ్జూజ్ డ్రా 119వ వారపు డ్రాలో 1,000,000 దిర్హామ్ల రాఫిల్ బహుమతిని గెలుచుకున్నాడు. పెద్ద సూపర్ మార్కెట్ చైన్లో పనిచేస్తున్న ఈ 38 ఏళ్ల గ్రాఫిక్ డిజైనర్.. 14 సంవత్సరాల క్రితం యూఏఈ వచ్చాడు. ఇంతకుముందు మహ్జూజ్లో చిన్న బహుమతులను గెలుచుకున్నానని, కానీ ఇంత పెద్ద మొత్తంలో బహుమతి గెలుచుకోవడం నమ్మశక్యం కావడం లేదన్నారు. వచ్చిన బహుమతి మనీనుంచి కొంత భాగాన్ని తన ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకుంటానని తెలిపారు. అదే డ్రాలో 25 మంది ఇతర పార్టిసిపెంట్లు ఐదు నంబర్లలో నాలుగింటిని సరిపోల్చారు. రెండవ బహుమతి కింద Dh200,000 పంచుకున్నారు. ఒక్కొక్కరు Dh8,000 సంపాదించారు. 1,030 మంది ఇతర విజేతలు ఐదు సంఖ్యలలో మూడింటితో సరిపోల్చడంతో.. ఒక్కొక్కరు Dh250 అందుకున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!







