TCS కొత్త సీఈఓగా కె.కృతివాసన్!
- March 16, 2023
న్యూఢిల్లీ: భారత్ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథన్ తన పదవికి రాజీనామా సమర్పించినట్టు కంపెనీ తెలిపింది.
ఆయన స్థానంలో కె కృతివాసన్ సంస్థ సీఈఓ, ఎండీగా బాధ్యతలు చేపడతారని కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్లో వెల్లడించింది. రాజేష్ గోపీనాథన్ సెప్టెంబర్ వరకు కంపెనీలోనే కొనసాగనున్నారు. వాటాదారుల ఆమోదానికి లోబడి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయన తన బాధ్యతలను స్వీకరిస్తారు.
గురువారం(మార్చి 16) నుంచి కృతివాసన్ సీఈఓ డిజిగ్నేట్గా వ్యవహరిస్తారని కంపెనీ తెలిపింది. కె కృతివాసన్ ప్రస్తుతం టీసీఎస్లో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) వ్యాపార విభాగానికి అధ్యక్షుడు, గ్లోబల్ హెడ్గా ఉన్నారు. 1989లో కంపెనీలో చేరిన కృతివాసన్ 34 ఏళ్లుగా కంపెనీలో భాగస్వామ్యం కలిగిన ఆయన కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, లార్జ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, సేల్స్ వంటి అనేక విభాగాల్లో ఆయన పనిచేశారు.
కృతివాసన్ టీసీఎస్ ఐర్లాండ్ డైరెక్టర్ల బోర్డు, టీసీఎస్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఏజీ పర్యవేక్షక బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని, ఐఐటీ కాన్పూర్ నుంచి ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.
తాజా వార్తలు
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు







