TCS కొత్త సీఈఓగా కె.కృతివాసన్!
- March 16, 2023
న్యూఢిల్లీ: భారత్ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథన్ తన పదవికి రాజీనామా సమర్పించినట్టు కంపెనీ తెలిపింది.
ఆయన స్థానంలో కె కృతివాసన్ సంస్థ సీఈఓ, ఎండీగా బాధ్యతలు చేపడతారని కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్లో వెల్లడించింది. రాజేష్ గోపీనాథన్ సెప్టెంబర్ వరకు కంపెనీలోనే కొనసాగనున్నారు. వాటాదారుల ఆమోదానికి లోబడి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయన తన బాధ్యతలను స్వీకరిస్తారు.
గురువారం(మార్చి 16) నుంచి కృతివాసన్ సీఈఓ డిజిగ్నేట్గా వ్యవహరిస్తారని కంపెనీ తెలిపింది. కె కృతివాసన్ ప్రస్తుతం టీసీఎస్లో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) వ్యాపార విభాగానికి అధ్యక్షుడు, గ్లోబల్ హెడ్గా ఉన్నారు. 1989లో కంపెనీలో చేరిన కృతివాసన్ 34 ఏళ్లుగా కంపెనీలో భాగస్వామ్యం కలిగిన ఆయన కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, లార్జ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, సేల్స్ వంటి అనేక విభాగాల్లో ఆయన పనిచేశారు.
కృతివాసన్ టీసీఎస్ ఐర్లాండ్ డైరెక్టర్ల బోర్డు, టీసీఎస్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఏజీ పర్యవేక్షక బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని, ఐఐటీ కాన్పూర్ నుంచి ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి