సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
- March 16, 2023
సికింద్రాబాద్: సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లోని ఏడు, ఎనిమిదో అంతస్తుల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. భవనంలో ఎనిమిది మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తుంది.
దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇక అగ్ని ప్రమాదంతో భవనం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగ కమ్ముకున్నది. ప్రస్తుతం స్వప్న లోక్ కాంప్లెక్స్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అంటే మెన్స్ వేర్ షాపులకు పెట్టింది పేరు. ఇక్కడ ఇప్పుడు రద్దీగా ఉంటుంది. ప్రతి రోజూ వేలాది మంది అక్కడ దుస్తులు కొనుగోలుకు వస్తుంటారు. మెన్స్ వేర్ కు ఫారెవర్ అనే ట్యాగ్ కూడా ఉంది. అలాంటి ఇక్కడ అగ్ని ప్రమాదం జరగడం తో అంత ఖంగారుపడుతున్నారు. గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు
- పవర్ఫుల్ పాస్పోర్టుల జాబితా విడుదల
- మార్చి 1 నుంచి లైసెన్స్ లేనివారి పై కఠిన చర్యలు
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డిల సేవలు చిరస్మరణీయం: మంత్రి దుర్గేష్
- గల్ఫ్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్
- కమ్యూనిటీ పోలీసింగ్’ ద్వారా ప్రజలతో మమేకం: సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేష్
- కటారాలో ఖతార్ హలాల్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విలువ $140 బిలియన్లు..!!
- దుబాయ్ లో వర్క్, బిజినెస్ వల్లే 90% ట్రాఫిక్ రద్దీ..!!









