సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
- March 16, 2023
సికింద్రాబాద్: సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లోని ఏడు, ఎనిమిదో అంతస్తుల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. భవనంలో ఎనిమిది మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తుంది.
దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇక అగ్ని ప్రమాదంతో భవనం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగ కమ్ముకున్నది. ప్రస్తుతం స్వప్న లోక్ కాంప్లెక్స్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అంటే మెన్స్ వేర్ షాపులకు పెట్టింది పేరు. ఇక్కడ ఇప్పుడు రద్దీగా ఉంటుంది. ప్రతి రోజూ వేలాది మంది అక్కడ దుస్తులు కొనుగోలుకు వస్తుంటారు. మెన్స్ వేర్ కు ఫారెవర్ అనే ట్యాగ్ కూడా ఉంది. అలాంటి ఇక్కడ అగ్ని ప్రమాదం జరగడం తో అంత ఖంగారుపడుతున్నారు. గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







