కువైట్ లో పేపర్ లెస్ ట్రాఫిక్ తాఖీదులు
- March 17, 2023
కువైట్: వచ్చే వారం నుండి ట్రాఫిక్ ఉల్లంఘన టికెట్ను ఉల్లంఘించిన వారికి పేపర్ స్లిప్కు బదులుగా మొబైల్ ఫోన్ కు మెసేజ్ ద్వారా పంపబడుతుంది. ఈ మేరకు అవేర్నెస్ డిపార్ట్మెంట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ మేజర్ అబ్దుల్లా అబు అల్-హసన్ తెలిపారు. వచ్చే వారం నుండే పేపర్ ఆధారిత ఉల్లంఘనల జారీ క్రమంగా నిలిపివేయబడుతుందని పేర్కొన్నారు. అన్ని ఉల్లంఘనలను మొబైల్ యాప్ లేదా టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఎలక్ట్రానిక్గా ఉల్లంఘించిన వారికి పంపిస్తామని ప్రకటించారు. ట్రాఫిక్ పోలీసు తన పనిలో ఉపయోగించే వైర్లెస్ పరికరం ద్వారా జరిమానాను జారీ చేయనున్నారు. ఇది పేపర్లెస్ ఆఫీస్ విభాగం చొరవలో భాగమని అల్-హసన్ తెలిపారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







