వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలు..హాజరైన ప్రధాని మోదీ
- March 20, 2023
న్యూఢిల్లీ: శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, న్యూఢిల్లీలోని తమ అధికారిక నివాసంలో ఉగాది మిలన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఉగాదిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలను తిలకించిన ప్రధానమంత్రి, మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే విధంగా ఢిల్లీలో చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వెంకయ్యనాయుడు వారి శ్రీమతి ఉషమ్మ, కుమార్తె శ్రీమతి దీపావెంకట్ సహా ఇతర కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, పూర్వ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, సుప్రీం కోర్ట్ పూర్వ చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, రాజ్యసభ చైర్మన్ హరివంశ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు.



తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







