వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలు..హాజరైన ప్రధాని మోదీ
- March 20, 2023
న్యూఢిల్లీ: శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, న్యూఢిల్లీలోని తమ అధికారిక నివాసంలో ఉగాది మిలన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఉగాదిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలను తిలకించిన ప్రధానమంత్రి, మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే విధంగా ఢిల్లీలో చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వెంకయ్యనాయుడు వారి శ్రీమతి ఉషమ్మ, కుమార్తె శ్రీమతి దీపావెంకట్ సహా ఇతర కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, పూర్వ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, సుప్రీం కోర్ట్ పూర్వ చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, రాజ్యసభ చైర్మన్ హరివంశ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు.



తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







