మార్చి 21న శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల
- March 20, 2023
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) మంగళవారం(మార్చి21,2023) శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటాను విడుదల చేయనుంది. జూన్ నెల ఆన్ లైన్ కోటా శ్రీవాణి దర్శనం టికెట్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జూన్ నెల కోటాను మార్చి23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవల టికెట్లను విడుదల చేయనుంది. జూన్ నెల ఆర్జితసేవా టికెట్ల ఆన్లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ మార్చి24న ఉదయం 11 గంటలకు మొదలు కానుంది. జూన్ నెల అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి24న టీటీడీ విడుదల చేయనుంది.
ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు ఏప్రిల్ నెల ఉచిత, ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మార్చి24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడి ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







