మార్చి 21న శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల
- March 20, 2023
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) మంగళవారం(మార్చి21,2023) శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటాను విడుదల చేయనుంది. జూన్ నెల ఆన్ లైన్ కోటా శ్రీవాణి దర్శనం టికెట్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జూన్ నెల కోటాను మార్చి23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవల టికెట్లను విడుదల చేయనుంది. జూన్ నెల ఆర్జితసేవా టికెట్ల ఆన్లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ మార్చి24న ఉదయం 11 గంటలకు మొదలు కానుంది. జూన్ నెల అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి24న టీటీడీ విడుదల చేయనుంది.
ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు ఏప్రిల్ నెల ఉచిత, ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మార్చి24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడి ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







