ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముగిసిన కవిత విచారణ..
- March 20, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. సోమవారం రాత్రి 09.00 గంటల తర్వాత కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఉదయం 11.00 గంటల నుంచి ఢిల్లీలోని కార్యాలయంలో కవితను ఈడీ అధికారులు విచారించారు.
దాదాపు పదిన్నర గంటలుపైగా కవితను అధికారులు ప్రశ్నించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి కూడా కవితను అధికారులు ప్రశ్నించారు. కవిత విచారణ సందర్భంగా ఈడీ కార్యాలయం వద్ద సాయంత్రం నుంచి ఉత్కంఠ నెలకొంది. విచారణ సందర్భంగా కవిత వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ పాత్ర, కవిత ప్రమేయం, ఆధారాల ధ్వంసం వంటి అంశాలపై అధికారులు ప్రశ్నించారు. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఎలాంటి ఆధారాలు ధ్వంసం చేయలేదని కవిత చెప్పినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందనే విషయం కూడా తెలియదని కవిత చెప్పారని సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 11న జరిగిన విచారణ సందర్భంగా కవిత తాను ఇచ్చిన వాంగ్మూలానికి కొనసాగింపుగానే, ఈ రోజు కూడా తన వాదన వినిపించినట్లు తెలుస్తోంది. ఈ రోజు విచారణ ముగిసిన నేపథ్యంలో, మంగళవారం మరోసారి ఈడీ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







