ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముగిసిన కవిత విచారణ..
- March 20, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. సోమవారం రాత్రి 09.00 గంటల తర్వాత కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఉదయం 11.00 గంటల నుంచి ఢిల్లీలోని కార్యాలయంలో కవితను ఈడీ అధికారులు విచారించారు.
దాదాపు పదిన్నర గంటలుపైగా కవితను అధికారులు ప్రశ్నించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి కూడా కవితను అధికారులు ప్రశ్నించారు. కవిత విచారణ సందర్భంగా ఈడీ కార్యాలయం వద్ద సాయంత్రం నుంచి ఉత్కంఠ నెలకొంది. విచారణ సందర్భంగా కవిత వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ పాత్ర, కవిత ప్రమేయం, ఆధారాల ధ్వంసం వంటి అంశాలపై అధికారులు ప్రశ్నించారు. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఎలాంటి ఆధారాలు ధ్వంసం చేయలేదని కవిత చెప్పినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందనే విషయం కూడా తెలియదని కవిత చెప్పారని సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 11న జరిగిన విచారణ సందర్భంగా కవిత తాను ఇచ్చిన వాంగ్మూలానికి కొనసాగింపుగానే, ఈ రోజు కూడా తన వాదన వినిపించినట్లు తెలుస్తోంది. ఈ రోజు విచారణ ముగిసిన నేపథ్యంలో, మంగళవారం మరోసారి ఈడీ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









