పలు సర్వీసులను రద్దు చేసిన ఎయిర్ ఇండియా!
- March 21, 2023
యూఏఈ: ఇండియాలోని కోజికోడ్, ఇండోర్, గోవాలకు అనేక సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. వాటి స్థానంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులను ప్రకటించింది. దీంతో భారతదేశానికి వెళ్లాలనుకునే వారికి మార్చి 26 నుండి విమాన ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా ప్రతినిధి పి.పి. సింగ్ తెలిపారు. త్వరలోనే ఢిల్లీ, ముంబాయి వంటి ప్రధాన నగరాలకి కూడా విమాన సర్వీసులను రీ షెడ్యూల్ చేస్తామని పేర్కొన్నారు. స్థానిక ట్రావెల్ ఏజెంట్ల ప్రకారం.. ఈ మార్పు గురించి ఇప్పుడే వార్తలు వచ్చినా.. భారతదేశంలోని అనేక నగరాలకు విమాన ధరలు ఇప్పటికే పెరిగాయని తెలిపారు. ఈ వేసవిలో ప్రయాణించాలని చూస్తున్న వారు టిక్కెట్ల కోసం చాలా ఎక్కువ ధరను చెల్లించవలసి ఉంటుందని స్మార్ట్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అఫీ అహ్మద్ అన్నారు. వీల్చైర్లలో ప్రయాణించే వారిని తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఏకైక భారతీయ విమానం ఎయిర్ ఇండియా మాత్రమే కాబట్టి వారు మరింత ఇబ్బందికర పరిస్థితి అని తెలిపారు.
తాజా వార్తలు
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?
- ఒమన్ లో భారీ వర్షాలు..భద్రతా హెచ్చరికలు జారీ..!!









