పలు సర్వీసులను రద్దు చేసిన ఎయిర్ ఇండియా!

- March 21, 2023 , by Maagulf
పలు సర్వీసులను రద్దు చేసిన ఎయిర్ ఇండియా!

యూఏఈ: ఇండియాలోని కోజికోడ్, ఇండోర్, గోవాలకు అనేక సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. వాటి స్థానంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులను ప్రకటించింది. దీంతో భారతదేశానికి వెళ్లాలనుకునే వారికి మార్చి 26 నుండి విమాన ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా ప్రతినిధి పి.పి. సింగ్ తెలిపారు. త్వరలోనే ఢిల్లీ, ముంబాయి వంటి ప్రధాన నగరాలకి కూడా విమాన సర్వీసులను రీ షెడ్యూల్ చేస్తామని పేర్కొన్నారు.  స్థానిక ట్రావెల్ ఏజెంట్ల ప్రకారం.. ఈ మార్పు గురించి ఇప్పుడే వార్తలు వచ్చినా.. భారతదేశంలోని అనేక నగరాలకు విమాన ధరలు ఇప్పటికే పెరిగాయని తెలిపారు. ఈ వేసవిలో ప్రయాణించాలని చూస్తున్న వారు టిక్కెట్ల కోసం చాలా ఎక్కువ ధరను చెల్లించవలసి ఉంటుందని స్మార్ట్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అఫీ అహ్మద్ అన్నారు. వీల్‌చైర్‌లలో ప్రయాణించే వారిని తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఏకైక భారతీయ విమానం ఎయిర్ ఇండియా మాత్రమే కాబట్టి వారు మరింత ఇబ్బందికర పరిస్థితి అని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com