పలు సర్వీసులను రద్దు చేసిన ఎయిర్ ఇండియా!
- March 21, 2023
యూఏఈ: ఇండియాలోని కోజికోడ్, ఇండోర్, గోవాలకు అనేక సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. వాటి స్థానంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులను ప్రకటించింది. దీంతో భారతదేశానికి వెళ్లాలనుకునే వారికి మార్చి 26 నుండి విమాన ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా ప్రతినిధి పి.పి. సింగ్ తెలిపారు. త్వరలోనే ఢిల్లీ, ముంబాయి వంటి ప్రధాన నగరాలకి కూడా విమాన సర్వీసులను రీ షెడ్యూల్ చేస్తామని పేర్కొన్నారు. స్థానిక ట్రావెల్ ఏజెంట్ల ప్రకారం.. ఈ మార్పు గురించి ఇప్పుడే వార్తలు వచ్చినా.. భారతదేశంలోని అనేక నగరాలకు విమాన ధరలు ఇప్పటికే పెరిగాయని తెలిపారు. ఈ వేసవిలో ప్రయాణించాలని చూస్తున్న వారు టిక్కెట్ల కోసం చాలా ఎక్కువ ధరను చెల్లించవలసి ఉంటుందని స్మార్ట్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అఫీ అహ్మద్ అన్నారు. వీల్చైర్లలో ప్రయాణించే వారిని తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఏకైక భారతీయ విమానం ఎయిర్ ఇండియా మాత్రమే కాబట్టి వారు మరింత ఇబ్బందికర పరిస్థితి అని తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







