చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో రషీద్ రోవర్..!
- March 23, 2023
బహ్రెయిన్: చంద్రుని ఉపరితలంపైకి దిగిన మొదటి ఎమిరాటీ రోవర్ గా రషీద్ రోవర్ చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో ఉంది. రషీద్ రోవర్ ని విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు మొహమ్మద్ బిన్ రషీద్ అంతరిక్ష కేంద్రం (MBRSC) వెల్లడించింది. రషీద్ రోవర్ను మోసుకెళ్తున్న ఐస్పేస్ ల్యాండర్ ను ఇంజనీర్ల ఆధ్వర్యంలో మార్చి 21న యూఏఈ సమయం ప్రకారం.. ఉదయం 5.24 గంటలకు మిషన్ ఆపరేషన్ ప్లాన్కు అనుగుణంగా మొదటి చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టే ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం.. రషీద్ రోవర్ ఏప్రిల్ చివరిలో చంద్రునిపై దిగనుంది. అయితే, కచ్చితమైన ల్యాండింగ్ తేదీ, సమయంపై కొద్ది రోజుల్లో మరింత స్పష్టం వస్తుందని అంతరిక్ష కేంద్రం ప్రకటించింది. చంద్రుని ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి యూఏఈ చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక మిషన్ భవిష్యత్తులో ఇతర గ్రహాల అన్వేషణకు గేట్వేగా ఉపయోగపడుతుందని నిపుణులు తెలిపారు. ఈ మిషన్కు టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ (TDRA) ICT ఫండ్ నిధులు సమకూరుస్తుంది.
తాజా వార్తలు
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!
- యూఏఈ-భారత్ మధ్య విమాన ఛార్జీలు తగ్గుతాయా?
- సౌదీ అరేబియాలో 13,241 మందిపై బహిష్కరణ వేటు..!!
- లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్లో 17.3 శాతం పెరిగిన రియల్ ఇండెక్స్..!!
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు







