దుబాయ్-ముంబై విమానంలో మందుబాబుల వీరంగం..
- March 23, 2023
ముంబై: విమానంలో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగు చూస్తున్నాయి. తాజాగా దుబాయ్-ముంబై మధ్య ప్రయాణిస్తున్న ఒక విమానంలో కూడా ఇద్దరు ప్రయాణికులు వీరంగం సృష్టించారు. మద్యంమత్తులో విమాన సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారు.
దుబాయ్ నుంచి ముంబై వస్తున్న ఇండిగోకు చెందిన 6ఈ 1088 విమానంలో ఇద్దరు ప్రయాణికులు వీరంగం సృష్టించారు.అప్పటికే పూర్తి మద్యం మత్తులో ఉన్న ఈ ఇద్దరూ విమానంలో కూడా మద్యం తాగుతూ మరింత రెచ్చిపోయారు. పాల్ఘర్, కొల్హాపూర్కు చెందిన ఇద్దరు ప్రయాణికులు దుబాయ్లో ఏడాది పాటు పని చేసి, ఇండియా తిరిగొస్తున్నారు. దుబాయ్ ఎయిర్పోర్టు (డ్యూటీ ఫ్రీ)లో మద్యం కొనుక్కున్నారు. తర్వాత విమానంలో మద్యం తాగుతూ రచ్చ చేశారు. దీంతో తోటి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.ఈ విషయంపై విమాన సిబ్బంది వారిని హెచ్చరించారు. మద్యం తాగొద్దని సూచించారు. అయినా, ఆ ఇద్దరూ వినిపించుకోలేదు. విమాన సిబ్బందిని కూడా తిట్టారు.
ఎలాగోలా వారి దగ్గరి నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. విమానంలో రభస సృష్టించిన ఇద్దరిపై విమాన సిబ్బంది సీఐఎస్ఎఫ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక సహర్ పోలీస్ట స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 336, 21, 22, 25 కింద కేసు నమోదు చేశారు. దీంతో ప్రయాణికులు విమానం దిగిన వెంటనే వారిని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. అయితే, బుధవారం కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. కాగా, విమానంలో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి వారికి క్షమాపణలు చెబుతున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









