‘ఎన్టీయార్ 30’.! మనుషుల కన్నా మృగాలే ఎక్కువ.!
- March 23, 2023
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీయార్ అభిమానుల కోరిక నెరవేరింది. ఎన్టీయార్ 30 సినిమా తాజాగా లాంచ్ అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీయార్ నటిస్తున్న సినిమా ఇది. చిత్ర యూనిట్తో పాటూ, హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా సినిమా ప్రారంభోత్సవానికి హాజరైంది.
జాన్వీకపూర్ సౌత్లోకి ఎంట్రీ ఇస్తున్న సినిమా కూడా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్. మొదట్నుంచీ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయ్.
ఇక లాంచింగ్ డే సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఎన్టీయార్. ఈ సినిమాలో మనుషుల కన్నా మృగాలే ఎక్కువ వుంటాయ్.. అని చెప్పడం సినిమాపై అంచనాల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది.
సినిమాని చాలా చాలా పవర్ఫుల్గా తీర్చి దిద్దబోతున్నారన్న ఎన్టీయార్ మాటల ద్వారా అర్ధమవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీయార్ నటిస్తున్న సినిమా కావడంతో, ప్యాన్ ఇండియా స్థాయిలో సినిమాని నిర్మిస్తున్నారు. చూడాలి మరి, ఆల్రెడీ ‘ఆర్ఆర్ఆర్’తో సంపాదించుకున్నఎన్టీయార్ ప్యాన్ ఇండియా గుర్తింపును కొరటాల ఏ స్థాయిలో నిలబెట్టనున్నాడో ఈ సినిమాతో.!
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







