రమదాన్: ‘వన్హార్ట్ బహ్రెయిన్’ క్యాంపెయిన్ ప్రారంభం
- March 23, 2023
బహ్రెయిన్: వన్హార్ట్ బహ్రెయిన్ పవిత్ర రమదాన్ మాసంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి క్యాంపెయిన్ ను నిర్వహిస్తుంది. 2,000 మందికి ఆహారం అందించాలనే లక్ష్యంతో ఈ క్యాంపెయిన్ ప్రారంభమైంది. రమదాన్ మాసంలో మంచి చేయాలనే స్ఫూర్తితో.. సమాజానికి తిరిగి ఇవ్వాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని రమదాన్ , ఈద్ క్యాంపెయిన్ కు చెందిన వాలంటీర్ అయిన నూర్ మురాద్ తెలిపారు. నిరాశ్రయులకు భోజనాన్ని అందించడం తమ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశం అన్నారు. వన్హార్ట్ బహ్రెయిన్ తన 'టుగెదర్ వి గివ్, టుగెదర్ వి ఈట్' ప్రచారం ద్వారా బహ్రెయిన్లోని 2,000 మందికి ఆహారాన్ని పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. "మొత్తం మూడు 'టుగెదర్ వి గివ్' ఇఫ్తార్ ఈవెంట్లు ఉంటాయి. ఇవి వివిధ లేబర్ క్యాంపులలో ఆహారాన్ని అందజేస్తాయి.అలాగే మస్జీదులలోనూ ఉంటాయి" అని నూర్ చెప్పారు. ఇఫ్తార్ ఈవెంట్ ఏప్రిల్లో జరగనుంది. ఇక్కడ వన్హార్ట్ బహ్రెయిన్ అవుట్డోర్ ఫుడ్ పాప్ అప్ బూత్ను ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా వన్హార్ట్ అవసరమైన కుటుంబాల కోసం 'ఈద్ మీల్స్ విత్ లవ్'ను కూడా నిర్వహించింది. ఇందులో భాగంగా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు తయారు చేసిన భోజనాలను పంపిణీ చేశారు. "అత్యవసర ఆహార మద్దతు అవసరమైన 20 కుటుంబాలకు భోజనం నేరుగా పంపిణీ చేయబడుతుంది" అని నూర్ చెప్పారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







