రమదాన్: ‘వన్హార్ట్ బహ్రెయిన్’ క్యాంపెయిన్ ప్రారంభం
- March 23, 2023
బహ్రెయిన్: వన్హార్ట్ బహ్రెయిన్ పవిత్ర రమదాన్ మాసంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి క్యాంపెయిన్ ను నిర్వహిస్తుంది. 2,000 మందికి ఆహారం అందించాలనే లక్ష్యంతో ఈ క్యాంపెయిన్ ప్రారంభమైంది. రమదాన్ మాసంలో మంచి చేయాలనే స్ఫూర్తితో.. సమాజానికి తిరిగి ఇవ్వాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని రమదాన్ , ఈద్ క్యాంపెయిన్ కు చెందిన వాలంటీర్ అయిన నూర్ మురాద్ తెలిపారు. నిరాశ్రయులకు భోజనాన్ని అందించడం తమ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశం అన్నారు. వన్హార్ట్ బహ్రెయిన్ తన 'టుగెదర్ వి గివ్, టుగెదర్ వి ఈట్' ప్రచారం ద్వారా బహ్రెయిన్లోని 2,000 మందికి ఆహారాన్ని పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. "మొత్తం మూడు 'టుగెదర్ వి గివ్' ఇఫ్తార్ ఈవెంట్లు ఉంటాయి. ఇవి వివిధ లేబర్ క్యాంపులలో ఆహారాన్ని అందజేస్తాయి.అలాగే మస్జీదులలోనూ ఉంటాయి" అని నూర్ చెప్పారు. ఇఫ్తార్ ఈవెంట్ ఏప్రిల్లో జరగనుంది. ఇక్కడ వన్హార్ట్ బహ్రెయిన్ అవుట్డోర్ ఫుడ్ పాప్ అప్ బూత్ను ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా వన్హార్ట్ అవసరమైన కుటుంబాల కోసం 'ఈద్ మీల్స్ విత్ లవ్'ను కూడా నిర్వహించింది. ఇందులో భాగంగా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు తయారు చేసిన భోజనాలను పంపిణీ చేశారు. "అత్యవసర ఆహార మద్దతు అవసరమైన 20 కుటుంబాలకు భోజనం నేరుగా పంపిణీ చేయబడుతుంది" అని నూర్ చెప్పారు.
తాజా వార్తలు
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- 13 సంస్థలపై SR37 మిలియన్ల జరిమానా..!!
- రెండు దేశాలతో ఎయిర్ సర్వీసులకు సుల్తాన్ ఆమోదం..!!
- కువైట్ లో కొత్త రెసిడెన్సీ ఉల్లంఘన జరిమానాలు..!!
- ICRF ఫేబర్-కాస్టెల్ స్పెక్ట్రమ్ క్యాలెండర్ 2026 ఆవిష్కరణ..!!
- దుబాయ్ లో ఆ 4 బీచ్లు ఫ్యామిలీల కోసమే..!!
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..







