ముస్లింలకు ఏపీ సిఎం జగన్‌ శుభాకాంక్షలు

- March 24, 2023 , by Maagulf
ముస్లింలకు ఏపీ సిఎం జగన్‌ శుభాకాంక్షలు

అమరావతి: రంజాన్‌ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా ... ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు సిఎంవో గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

''మహనీయుడైన మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించిన ఈ మాసంలో.. నెల రోజులపాటు నియమ నిష్టలతో ముస్లింలు కఠిన ఉపవాస వ్రతం ఆచరించి అల్లాV్‌ా కఅపకు పాత్రులవుతారని అన్నారు. క్రమశిక్షణ, దాతఅత్వం, ధార్మిక చింతనల కలయికే జీవితమని రంజాన్‌ మాసం గొప్ప సందేశం ఇస్తోందని చెప్పారు. 'కఠిన ఉపవాస దీక్ష (రోజా) ఆచరిస్తూ, దైవ చింతనతో గడిపే ఈ మాసంలో ముస్లింలు తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దాన ధర్మాల ద్వారా ఖర్చు చేస్తారు.మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్‌.ఈ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలు అందరికీ శుభాకాంక్షలు'' అని సిఎం జగన్‌ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com