రూ.500 నోట్లు బంద్.. రూమర్స్ పై కేంద్ర ప్రభుత్వం వివరణ
- January 03, 2026
న్యూ ఢిల్లీ: భారతదేశంలో కరెన్సీ నోట్ల విషయంలో ఏ చిన్న రూమర్ వచ్చినా ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా నోట్ల రద్దు అనగానే 2016 నవంబర్ 8న జరిగిన సంఘటన చాలామందికి వెంటనే గుర్తుకొస్తుంది. ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా రూ.1000, రూ.500(500) విలువైన పాత నోట్లు చెల్లవని ప్రకటించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపింది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూలు, నగదు కొరత వంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆ నిర్ణయం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త డిజైన్లో రూ.500, రూ.2000 కొత్త నోట్లను చెలామణిలోకి తీసుకొచ్చింది. కొంతకాలం పాటు ఈ రెండు నోట్లు దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. అయితే కాలక్రమేణా పెద్ద మొత్తాల లావాదేవీలను నిరుత్సాహపరచాలనే ఉద్దేశంతో RBI రూ.2000 నోట్ల వినియోగాన్ని క్రమంగా తగ్గించడం ప్రారంభించింది. చివరకు మే 2023లో రూ.2000 నోట్లను చెలామణి నుండి ఉపసంహరిస్తామని.. ప్రజలు తమ దగ్గర ఉన్న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చని లేదా మార్పిడి చేసుకోవచ్చని అధికారికంగా ప్రకటించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









