'ప్రతిభావంతుల ప్రపంచ రాజధాని'గా యూఏఈ: షేక్ మహమ్మద్
- March 29, 2023
యూఏఈ: దేశాన్ని 'ప్రతిభావంతుల ప్రపంచ రాజధాని'గా మార్చడానికి 19 కార్యక్రమాలను యూఏఈ కేబినేట్ సమీక్షించింది. ఈ కేబినెట్ సమావేశానికి యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్ర, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షత వహించారు. అదే విధంగా సీనియర్ మేనేజర్ల విషయంలో యూఏఈ ప్రపంచవ్యాప్తంగా ఎలా రెండవ స్థానంలో ఉందో వివరించారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైపుణ్యాన్ని ఆకర్షించడం ద్వారా దేశం జాతీయ ప్రతిభను పెంపొందించుకోవాలని ఆయన చెప్పారు.ఇదిలా ఉండగా, వచ్చే ఏడేళ్లలో దేశ రీ-ఎగుమతి పరిశ్రమను రెట్టింపు చేసేందుకు 24 కార్యక్రమాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని షేక్ మహమ్మద్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 వాణిజ్య కార్యాలయాలు యూఏఈలో తమ నెట్వర్క్ ను 100 శాతం విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య చర్చల కోసం సుప్రీం కమిటీ పని ఫలితాలను కూడా కేబినెట్ సమీక్షించింది. ఇటీవల నాలుగు దేశాలతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేసామని, ప్రస్తుతం కోస్టా రికాతో సహా చాలా దేశాలతో చర్చలు జరుపుతోందని షేక్ మహమ్మద్ పేర్కొన్నారు.
.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







