'ప్రతిభావంతుల ప్రపంచ రాజధాని'గా యూఏఈ: షేక్ మహమ్మద్
- March 29, 2023
యూఏఈ: దేశాన్ని 'ప్రతిభావంతుల ప్రపంచ రాజధాని'గా మార్చడానికి 19 కార్యక్రమాలను యూఏఈ కేబినేట్ సమీక్షించింది. ఈ కేబినెట్ సమావేశానికి యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్ర, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షత వహించారు. అదే విధంగా సీనియర్ మేనేజర్ల విషయంలో యూఏఈ ప్రపంచవ్యాప్తంగా ఎలా రెండవ స్థానంలో ఉందో వివరించారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైపుణ్యాన్ని ఆకర్షించడం ద్వారా దేశం జాతీయ ప్రతిభను పెంపొందించుకోవాలని ఆయన చెప్పారు.ఇదిలా ఉండగా, వచ్చే ఏడేళ్లలో దేశ రీ-ఎగుమతి పరిశ్రమను రెట్టింపు చేసేందుకు 24 కార్యక్రమాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని షేక్ మహమ్మద్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 వాణిజ్య కార్యాలయాలు యూఏఈలో తమ నెట్వర్క్ ను 100 శాతం విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య చర్చల కోసం సుప్రీం కమిటీ పని ఫలితాలను కూడా కేబినెట్ సమీక్షించింది. ఇటీవల నాలుగు దేశాలతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేసామని, ప్రస్తుతం కోస్టా రికాతో సహా చాలా దేశాలతో చర్చలు జరుపుతోందని షేక్ మహమ్మద్ పేర్కొన్నారు.
.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!







