యూఏఈ కొత్త ఉపాధ్యక్షుడు, అబుధాబి క్రౌన్ ప్రిన్స్
- March 30, 2023
యూఏఈ: ఉపాధ్యక్షుడు, అబుధాబి క్రౌన్ ప్రిన్స్, ఇద్దరు డిప్యూటీ పాలకులను నియమిస్తూ యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ను యూఏఈ వైస్ ప్రెసిడెంట్గా నియమించారు. అతను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్తో కలిసి పనిచేయనున్నారు. షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ను అబుధాబి క్రౌన్ ప్రిన్స్గా నియమించారు. షేక్ ఖలీద్ అబుధాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు, అబుధాబి ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఛైర్మన్ గా కూడా ఉన్నారు. అదే విధంగా అబుధాబికి ఇద్దరు డిప్యూటీ పాలకులుగా షేక్ హజ్జా బిన్ జాయెద్ (అబుధాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్), షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్( జాతీయ భద్రతా సలహాదారు)లను షేక్ మొహమ్మద్ నియమించారు. కొత్తగా నియమితులైన నాయకులకు షేక్ మహ్మద్ బిన్ రషీద్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







