యూఏఈ కొత్త ఉపాధ్యక్షుడు, అబుధాబి క్రౌన్ ప్రిన్స్
- March 30, 2023
యూఏఈ: ఉపాధ్యక్షుడు, అబుధాబి క్రౌన్ ప్రిన్స్, ఇద్దరు డిప్యూటీ పాలకులను నియమిస్తూ యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ను యూఏఈ వైస్ ప్రెసిడెంట్గా నియమించారు. అతను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్తో కలిసి పనిచేయనున్నారు. షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ను అబుధాబి క్రౌన్ ప్రిన్స్గా నియమించారు. షేక్ ఖలీద్ అబుధాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు, అబుధాబి ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఛైర్మన్ గా కూడా ఉన్నారు. అదే విధంగా అబుధాబికి ఇద్దరు డిప్యూటీ పాలకులుగా షేక్ హజ్జా బిన్ జాయెద్ (అబుధాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్), షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్( జాతీయ భద్రతా సలహాదారు)లను షేక్ మొహమ్మద్ నియమించారు. కొత్తగా నియమితులైన నాయకులకు షేక్ మహ్మద్ బిన్ రషీద్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









