యూఏఈ కొత్త ఉపాధ్యక్షుడు, అబుధాబి క్రౌన్ ప్రిన్స్
- March 30, 2023
యూఏఈ: ఉపాధ్యక్షుడు, అబుధాబి క్రౌన్ ప్రిన్స్, ఇద్దరు డిప్యూటీ పాలకులను నియమిస్తూ యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ను యూఏఈ వైస్ ప్రెసిడెంట్గా నియమించారు. అతను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్తో కలిసి పనిచేయనున్నారు. షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ను అబుధాబి క్రౌన్ ప్రిన్స్గా నియమించారు. షేక్ ఖలీద్ అబుధాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు, అబుధాబి ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఛైర్మన్ గా కూడా ఉన్నారు. అదే విధంగా అబుధాబికి ఇద్దరు డిప్యూటీ పాలకులుగా షేక్ హజ్జా బిన్ జాయెద్ (అబుధాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్), షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్( జాతీయ భద్రతా సలహాదారు)లను షేక్ మొహమ్మద్ నియమించారు. కొత్తగా నియమితులైన నాయకులకు షేక్ మహ్మద్ బిన్ రషీద్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







