పాదచారుల క్రాసింగ్ ఉల్లంఘనల పర్యవేక్షణకు కొత్త రాడార్
- April 01, 2023
యూఏఈ: పాదచారుల క్రాసింగ్ల వద్ద ఆగని వాహనదారులను పర్యవేక్షించడానికి, నిబంధనలను ఉల్లంఘించే వారిని పట్టుకోవడానికి కొత్త రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సౌరశక్తితో నడిచే.. ఆటోమెటిక్ రాడార్లను ఏప్రిల్ 3 నుండి యాక్టివేట్ చేయనున్నట్లు ఉమ్ అల్ క్వైన్ పోలీసులు ప్రకటించారు. పాదచారుల క్రాసింగ్ల వద్ద ఆగకుండా కొందరు వాహనదారులు రన్ఓవర్ ప్రమాదాలకు కారణం అవుతున్నారని, ఆ తర్వాత జరిగే ప్రాణ, ఆస్తి నష్టాల సంఖ్యను తగ్గించడానికి రాడార్లను యాక్టివేట్ చేయనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. జీబ్రా క్రాసింగ్ల గుండా వెళ్లే సమయంలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, పాదచారులకు దారి ఇవ్వాలని అధికార యంత్రాంగం కోరింది. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం.. పాదచారులకు దారి ఇవ్వని వాహనదారులకు 500 దిర్హామ్లు జరిమానా, ఆరు బ్లాక్ పాయింట్లు ఫైన్ పడుతుంది. పాదచారుల క్రాసింగ్ల వద్ద ఆగని వాహనదారులను పర్యవేక్షించడానికి, పట్టుకోవడానికి అబుధాబిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా నడిచే రాడార్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









