తిరుపతి నుంచి ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు!
- April 02, 2023
తిరుపతి: ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక నగరం తిరుపతి నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.ఇందు కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తోంది. ముందుగా తిరుపతి నుంచి కువైట్కు విమాన సర్వీసులు ప్రారంభించేలా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, విమానయాన సంస్థలతో ఎంపీ గురుమూర్తి, ఎయిర్పోర్టు అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.తిరుపతి నుంచి కువైట్కు సర్వీసులు నడపడానికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నుంచి సంకేతాలు వచ్చాయని తిరుపతి ఎయిర్పోర్టు డైరెక్టర్ రాజ్కిషోర్ చెప్పారు.
తిరుపతి విమానాశ్రయానికి 2017లోనే అంతర్జాతీయ విమానాశ్రయ హోదా వచ్చింది. అయితే, ఇప్పటివరకు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కాలేదు.దీంతో ప్రభుత్వం అంతర్జాతీయ సర్వీసులు ప్రత్యేక దృష్టి సారించి, తిరుపతి నుంచి ప్రపంచ నగరాలకు విమానాలు నడిచేలా కృషి చేస్తోంది.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







