తిరుపతి నుంచి ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు!
- April 02, 2023
తిరుపతి: ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక నగరం తిరుపతి నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.ఇందు కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తోంది. ముందుగా తిరుపతి నుంచి కువైట్కు విమాన సర్వీసులు ప్రారంభించేలా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, విమానయాన సంస్థలతో ఎంపీ గురుమూర్తి, ఎయిర్పోర్టు అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.తిరుపతి నుంచి కువైట్కు సర్వీసులు నడపడానికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నుంచి సంకేతాలు వచ్చాయని తిరుపతి ఎయిర్పోర్టు డైరెక్టర్ రాజ్కిషోర్ చెప్పారు.
తిరుపతి విమానాశ్రయానికి 2017లోనే అంతర్జాతీయ విమానాశ్రయ హోదా వచ్చింది. అయితే, ఇప్పటివరకు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కాలేదు.దీంతో ప్రభుత్వం అంతర్జాతీయ సర్వీసులు ప్రత్యేక దృష్టి సారించి, తిరుపతి నుంచి ప్రపంచ నగరాలకు విమానాలు నడిచేలా కృషి చేస్తోంది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









