ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్
- April 04, 2023
బహ్రెయిన్: భారత రాయబార కార్యాలయం మార్చి 31న నిర్వహించిన ఓపెన్ హౌస్ సక్సెస్ అయింది. బహ్రెయిన్ రాజ్యంలోని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఎంబసీ కాన్సులర్ బృందం, న్యాయవాదుల ప్యానెల్ కూడా ఈ ఓపెన్ హౌస్ లో పాల్గొన్నారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో దాదాపు 70 మంది భారతీయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబాసిడర్ శ్రీవాస్తవ ప్రతి ఒక్కరికీ పవిత్ర రమదాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేశారు. మార్చి నెలలో భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం 146వ IPU అసెంబ్లీకి హాజరయ్యారని, అలాగే రెండు మంత్రుల స్థాయి బృందాలు బహ్రెయిన్ లో పర్యటించారని గుర్తుచేశారు. భారత్, బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల సానుకూల పథం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ICWF ద్వారా అవసరమైన వ్యక్తులకు అత్యవసర ధృవీకరణ పత్రాలు, టిక్కెట్లను మంజూరు, బోర్డింగ్, వసతిని అందించడం ద్వారా భారతీయ పౌరులకు ఎంబసీ సహాయం చేయడం కొనసాగిస్తుందన్నారు. ఇదే క్రమంలో ఇటీవల దొంగా కన్నమ్మ, రాజన్ ముంగి లకు ICWF ద్వారా విమాన టిక్కెట్లు అందించడంతో వారు భారతదేశానికి తిరిగి వెళ్లారని పేర్కొన్నారు. కాన్సులర్, కమ్యూనిటీ సంక్షేమ విషయాలకు సంబంధించి సత్వర మద్దతు, చర్య కోసం కార్మిక మంత్రిత్వ శాఖ, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA), ఇమ్మిగ్రేషన్ అధికారులతో సహా బహ్రెయిన్ ప్రభుత్వ అధికారులకు రాయబారి శ్రీవాస్తవ ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్లో సముద్ర ఉద్రిక్తతల పై 40కి పైగా దేశాలు ఆందోళన..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 చొప్పున గెలిచిన ఐదుగురు..!!
- ప్రాంతీయ పరిణామాలను సమీక్షించిన అమీర్, ఇటలీ పీఎం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 59 రకాల మాదక ద్రవ్యాలు స్వాధీనం..!!
- డ్రోన్ల అమ్మకం, పంపిణీ పై కువైట్ నిషేధం..!!
- మోసపూరిత బీమా కంపెనీలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..!!
- సహమ్లో ఇద్దరిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్









