ఒమన్ లో ప్రారంభమైన గులాబీ పంట సీజన్
- April 04, 2023
మస్కట్: అదఖిలియా గవర్నరేట్ అల్ జబల్ అల్ అఖ్దర్ విలాయత్లో గులాబీ పంట సీజన్ ప్రారంభమైంది. 3,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో.. 7 నుండి 10 ఎకరాల విస్తీర్ణంలో 5,000 కంటే ఎక్కువ గులాబీ చెట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆ చెట్ల నుంచి 28,000 లీటర్ల రోజ్ వాటర్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. అల్ జబల్ అల్ అఖ్దర్లో గులాబీ పంట కాలం పర్యాటకానికి ప్రసిద్ధి చెందింది. గులాబీ పంట సీజన్ పర్యాటకులు సాంప్రదాయ, ఆధునిక పద్ధతులను నిశితంగా పరిశీలించడానికి వీలు కల్పిస్తుందని అడాఖిలియా గవర్నరేట్లోని హెరిటేజ్ అండ్ టూరిజం అసిస్టెంట్ డైరెక్టర్ అలీ సైఫ్ అల్ షుకైలీ అన్నారు. సీజన్ మార్చి చివరి నుండి ప్రారంభమై.. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మధ్య వరకు కొనసాగుతుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే రోజ్ వాటర్ ను అలంకార ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, స్వీట్లు, ఒమానీ కాఫీలలో ఉపయోగిస్తారని అల్ షుకీలీ తెలిపారు. అల్ జబల్ అల్ అఖ్దర్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ ప్రాముఖ్యతను ఇస్తుందని, ముఖ్యంగా పర్యాటక రిసార్ట్లు, హోటళ్లు, గెస్ట్హౌస్ల వంటి పర్యాటక ప్రాజెక్టులలో మంచి పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







