$100,000 గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- April 05, 2023
మస్కట్: మస్కట్ డ్యూటీ ఫ్రీ రాఫిల్ డ్రా ‘ది బిగ్ క్యాష్ టికెట్’లో భాగంగా భారతీయ ప్రవాస భారతీయుడు జియో టెక్కినియాత్ జాకబ్ అదృష్ట విజేతగా నిలిచి $100,000 గెలుచుకున్నాడు. సోమవారం జరిగిన రాఫిల్ డ్రా లో విజేతను ప్రకటించారు. ఈ మేరకు మస్కట్ డ్యూటీ ఫ్రీ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో విజేతను ప్రకటించి అభినందించారు. గత నెలలో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే ప్రయాణీకుల కోసం మస్కట్ డ్యూటీ ఫ్రీ డ్రాను ప్రారంభించింది. ఆసక్తిగల ప్రయాణికులు పాల్గొని తమ గెలుపు అవకాశాలను పెంచుకోవడానికి..ఎక్కువ సంఖ్యలో రాఫిల్ టిక్కెట్లను కొనుగోలు చేయడానికి www.muscatdutyfree.com ని క్లిక్ చేయడం ద్వారా డ్రాలో ప్రవేశించవచ్చు. ఆన్లైన్లో రెండు రాఫెల్ టిక్కెట్ల కొనుగోలుపై 10 శాతం తగ్గింపు కూడా ఉందని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







